జననము:
పంచభూత స్థలములలో ఒకటైన చిదంబర క్షేత్రమునకు అతి సమీపములోని మరుదూరు అనే కుగ్రామములో రామయ్య పిళ్ళై మరియు చిన్నమ్మ అను దంపతులు ఉండిరి. వారు శైవ కుటుంబీకులు. రామయ్య పిళ్ళై ఊరి కరణముగా ఉండిరి. వీరు నలుగురు సంతానమును కలిగి ఉండిరి. వారు సభాపతి, పరసురామన్, సుందరాంబాళ్ మరియు ఉణ్ణామలై .
ఒక నాడు ఒక యోగీశ్వరుడు, రామయ్య చిన్నమ్మల గృహమునకు విచ్చేసిరి. ఆ దంపతులు ఇరువరు వారిని అతిధి సత్కారములతో సత్కరించిరి. ఆ యోగీశ్వరుడు చిన్నమ్మను, ఒక దివ్య పురుషునికి తల్లి కాగలవని ఆశీర్వదించి విభూతిని ప్రసాదించెను.
ఆ తరువాత చిన్నమ్మ రామయ్య దంపతులకు ఐదవ సంతానముగా 1823 వ సంవత్సరం అక్టోబర్ 5 వ తేది ఆదివారము రామలింగ స్వామి వారు జన్మించిరి .
ఈ జననము యథేచ్చగా జరిగినది కాదు. సర్వ మానవాళి ఉన్నత స్థాయిని అధిరోహించుటకు, సత్యమును బోధించి దివ్య జీవనము పొందు మార్గమును ఉపదేశించి వారికి మార్గ నిర్దేశము చేయుటకు ఆ పరమాత్ముడు తనను ఈ భూ మండలములో జనియింప చేసాడని శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారే స్వయముగా ఈ విధముగా తెలియజేసి ఉన్నారు.
" அகத்தே கருத்துப் புறத்து வெளுத்து இருந்த உலகர் அனைவரையும்
சகத்தே திருத்திச் சன்மார்க்க சங்கத்து அடைவித்திடவும் அவரும்
இகத்தே பரத்தைப் பெற்று மகிழ்ந்திடுதற்கு என்றே எனை இந்த
யுகத்தே இறைவன் வருவிக்க உற்றேன் அருளைப் பெற்றேனே ! "
చిదంబర దర్శనము:
ఐదు నెలల శిశు ప్రాయములో వారి తల్లిదండ్రులు దైవ దర్శనానికై స్వామివారిని చిదంబరమునకు తీసుకొని వెళ్ళిరి. చిదంబర ఆలయములో గర్భ గుడిలోని దైవ దర్శనము అనంతరము చిదంబర రహస్యమను చిత్ అంబర దర్శనమును చూపించెదరు. ఇది ఇప్పటికీ ఆ ఆలయములో గల ప్రధాన సాంప్రదాయము. ఇదే నిజమైన చిదంబర ఆలయ దర్శనము. ఆ చిదంబర రహస్య దర్శనము గావించుచుండగా, దానిని చూసిన ఐదు నెలల పసికందు అయిన రామలింగము పక పక నవ్వుచూ కేరింతలు కొట్టి ఆనందించెను. దీనిని చూసిన ఆలయ అర్చకులు ఈ బిడ్డ సామాన్యుడు కాడని, సాక్షాత్తు ఆ నటరాజుని కుమారుడని ఆశ్చర్యపడి, ఆ దంపతులను వారి ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి, ఆశీర్వదించి పంపిరి. ఈ దర్శన వివరమును స్వామి వారు తమ 49 వ ఏట తాము వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంధములో ఈ విధముగా పొందు పరచియున్నారు.
" தாய் முதலோரோடு சிறு பருவத்தில் தில்லைத்
தலத்திடையே திரை தூக்கித் தரிசித்த போது
மேய் வகைமேல் காட்டாதே என்தனக்கே எல்லாம்
வெளியாகக் காட்டிய என் மெய்யுருவாம் பொருளே
காய்வகை இல்லாது உளத்தே கனிந்த நறுங்கனியே
கனவிடத்தும் நனவிடத்தும் எனைப்பிரியாக் களிப்பே
தூய்வகையோர் போற்ற மணி மன்றில் நடம் புரியுஞ்
ஜோதி நடத்தரசே என் சொல்லும் அணிந்தருளே ! "
అనగా,
తల్లి మొదలైన వారితో చిరు ప్రాయమున చిదంబర క్షేత్రమున తెరను తీసి దర్శించినప్పుడు అంతటా శూన్యమును, ఆకాశమును చూపిన నా సత్య స్వరూపమా
నా హృదయములో ఫలించిన సుఫలమా
స్వప్నములోనూ మెలకువలోనూ నన్ను వీడని ఆనందమా
స్వచ్ఛమైన వారు ప్రశంసించుచుండగా ఛిదాకాసములో నాట్యమాడు
జ్యోతి నటరాజా నా మాటలను ఆలకించి అనుగ్రహించుము.
బాల్యము:
చిదంబర దర్శనానంతరం ఆలయములో కలిగిన అనుభవముతో దైవానుగ్రహము పొందిన ఆనందోత్సాహములు ముగియక ముందే ఒక నెల సమయములోనే స్వామివారి తండ్రి రామయ్య పిళ్ళై మరణించెను.
ఒంటరిగా పిల్లలను పెంచే స్థోమత లేక తన ఐదుగురు పిల్లలతో కలిసి మరుదూరును వదలి తన పుట్టినిల్లయిన చెంగల్పట్టు జిల్లా లోని చిన్నక్కావనము అను గ్రామములో ఆశ్రయము పొందెను.
కొన్ని సంవత్సరములు గడిచి పెద్ద కుమారుడైన సభాపతి పెద్ద వాడై కుటుంబ భారమును తనపై స్వీకరించెను. కుటుంబమును పోషించుటకు గొప్ప అవకాసములను చెన్నై పట్టణము తనకు కలిగించునని సభాపతి గ్రహించెను. ఆ కుటుంబము చిన్నక్కావనమును వదిలి చెన్నై పట్టణములో స్థిర పడెను.
స్వామివారు జన్మించిన మరుదూరు గ్రామములోని వారి స్వగ్రుహము తరువాత కాలములో ప్రార్థనా స్థలముగా పరిగణించబడెను. ప్రతి ఏటా తై పూస దినమున ప్రజలందరూ అక్కడ చేరి ప్రార్థనలు నిర్వహించెదరు.
విద్యాభ్యాసము మరియు పసి ప్రాయము:
చెన్నై పట్టణములో అన్న సభాపతి గొప్ప పండితులైన కంచి సభాపతి నావలార్ వద్ద తమిళ సాహిత్యమును అభ్యసించెను. ఆ పాండిత్యముచే కొంతమంది సీమంతుల సహకారముతో సభాపతి పురాణ, మత ప్రవచనలు గావించి సంపాదనను పొంది కుటుంబమును పోషించుచుండెను. ఇతర సమయములలో బాలురకు ప్రాథమిక విద్యను బోధించుచుండెను.
రామలింగమునకు అపుడు 5 సంవత్సరములు. అన్న సభాపతి ఒక గురువు గా తన తమ్మునికి తమిళ సాహిత్యములోని ప్రాథమిక విషయములను బోధించుటకు ప్రయత్నించెను. రామలింగం విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపకుండెను. సభాపతి, కాలక్రమేణా తన సోదరుడు ఆశక్తి చూపగలడని ఆశించెను. అయినప్పటికీ ఆ బాలుడు విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపక చెన్నై జార్జ్ టౌన్ లోని కందకోట్టం అను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయమునకు వెళ్లి దైవ ప్రార్థనలో మునిగియుండెను. తన సోదరుని వద్ద విద్యను అభ్యసించ ఆశక్తి చూపని బాలుడు పరుల వద్దనైననూ అభ్యసించునని ఆలోచించి సభాపతి తాను విద్య నేర్చుకున్న తన గురువు గారైన కంచి సభాపతి గారి వద్దనే తన సోదరుడు విద్యను అభ్యసించుటకు రామలింగమును ఆయనకు అప్పగించెను.
తనకున్న తమిళ సాహిత్య ప్రావీణ్యముతో రామలింగామును విద్యావంతుడను చేయుటకు గురువు ఎంతగానో ప్రయత్నించిననూ అతను ఏ విధముగానూ విద్య పట్ల ఆశక్తి ప్రదర్శించలేదు. ఎల్లప్పుడూ కందకొట్ట ఆలయమును దర్శించి, సుబ్రహ్మణ్య స్వామిని గూర్చి భక్తి గీతములను ఆలపించి ధ్యానము చేయుచుండెను.
ఒక నాడు గురువు గారు తమిళ వాచకము లోని నీతి వాక్యమును ఈ క్రింది విధముగా బోధించుచుండిరి.
ஓதாமல் ஒருநாளும் இருக்க வேண்டாம்
ஒருவரையும் பொல்லாங்கு சொல்லவேண்டாம்
மாதாவை ஒருநாளும் மறக்க வேண்டாம்
ఓదామల్ ఒరు నాళుం ఇరుక్క వేండాం
ఒరువరయుం పోల్లాంగు సొల్ల వేండాం
మాతావై ఒరు నాళుం మరక్క వేండాం
అనగా,
చదువకుండా ఏ రోజూ ఉండవద్దు
ఎవ్వరినీ చెడు మాటలు అనవద్దు
తల్లిని ఏ రోజూ మరువ వద్దు
ఇందుకు రామలింగము " అయ్యా! ఇట్లు వేండాం వేండాం (వద్దు వద్దు) అంటుంటే పిల్లలమైన మాకు అందులో ఏదో రహస్యము దాగి ఉంది అను భావన కలుగుట సహజము కనుక కావలెను అంటే దానిని కోరి చేయుట సహజముగా ఉండును." అని చెప్పి తాను నిత్యము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి తానే స్వయముగా రాసి ఆలాపించే "దైవమణి మాల" అను అధ్యాయము లోని ఒక కీర్తనను తన గురువు గారికి క్రింది విధముగా వినిపించెను.
ஒருமையுடன் நினது திரு மலரடி நினைக்கின்ற
உத்தமர் தம் உறவு வேண்டும்
உள்ளொன்று வைத்துப் புறம்பொன்று பேசுவார்
உறவு கலவாமை வேண்டும்
பெருமை பெறு நினது புகழ் பேச வேண்டும்
பொய்மை பேசாது இருக்க வேண்டும்
பெரு நெறி பிடித்தொழுக வேண்டும்
மதமான பேய் பிடியாதிருக்க வேண்டும்
மருவு பெண்ணாசையை மறக்கவே வேண்டும்
உனை மறவாதிருக்க வேண்டும்
மதி வேண்டும்; நின் கருணை நிதி வேண்டும்
நோயற்ற வாழ்வில் நான் வாழ வேண்டும்
ఒరుమయుడన్ నినదు తిరు మలరడి నినైక్కిండ్ర
ఉత్తమర్ తం ఉరవు వేండుం
ఉల్లొండ్రు వైత్తు పురం ఒండ్రు పెసువార్
ఉరవు కలవామై వేండుం
పెరుమై పెరు నినదు పుగళ్ పేస వేండుం
పోయిమై పేసాదు ఇరుక్క వేండుం
పెరు నెరి పిడిత్తోళుగ వేండుం
మదమాన పేయి పిడియాదిరుక్క వేండుం
మరువు పెన్నాశయై మరక్కవే వేండుం
ఉనై మరవాదిరుక్క వేండుం
మది వేండుం, నిన్ కరుణై నిధి వేండుం
నోయట్ర వాళ్విల్ నాన్ వాళ వేండుం
అనగా,
ఏకాగ్రతతో నీ పాదపద్మములను స్మరించు
ఉత్తముల అనుబంధము కావలెను
లోన ఒకటి తలచి బయటకు వేరొకటి మాట్లాడు
జనుల అనుభంధము కలుగని వరము కావలెను
గొప్పవైన నీ గొప్పతనమును
ఎల్లప్పుడూ మాటలాడుచుండవలెను
అబద్ధములాడుట మానవలెను
నిజమైన భక్తి మార్గములో
నిన్ను ఆరాధించవలెను
నిను మరువని గుణము కలిగి ఉండవలెను
మంచి బుద్ధికుశలత కలుగ వలెను
నీ కరుణామృతము కైకొనవలెను
బాధలు, రోగము లేని జీవితము
నేను గడుపవలెను
ఈ మాటలకు గురువుగారు ఈ విద్యార్థి యొక్క జ్ఞానమును ప్రశంసించి ఇతనికి విద్యనేర్పుటకు తాను అసమర్థుడనని, అన్నగారైన సభాపతిపిళ్ళై గారికి చెప్పి తమ్ముడైన రామలింగమును అప్పజెప్పెను. గురువుని ఎదిరించు జ్ఞానము కలిగినవాడా నీవు? అని తమ్ముని అన్న మందలించెను. ఆనాటి నుండి రామలింగము విద్యనభ్యసించుట మానుకొని పుణ్యక్షేత్రములను సందర్శించుచూ తిరుగుచుండెను.
దీనిని చూసిన అన్న సభాపతి కలతచెంది కోపముతో రామలింగమునకు అన్నపానీయములను ఇవ్వక ఇంటి నుండి వెలివేసెను. సభాపతి తీసుకొన్న అంతటి కఠిన నిర్ణయము కుడా అతనికి ఆశించిన ఫలితమును ఇవ్వలేదు.
దీనికి విరుద్ధముగా రామలింగము పూర్తిగా దైవ భక్తిలో నిమఘ్నమై ఎల్లప్పుడూ దైవ ప్రార్థన, ధ్యానములలో మునిగియుండెను. రోజులు గడిచినవి. వదినగారైన పాప్పాత్తి అమ్మాళ్ తాను తన కన్న బిడ్డలా పెంచుకొంటున్న రామలింగము పడు కష్టములను చూసి బాధపడెను.
ఒక నాడు ఆమె కన్నీరు పర్యంతమై రామలింగాముతో బుద్ధిగా చదువుకొని అన్నగారి మనసు నొప్పక నడుచుకొనవలెనని వేడుకొనెను. తల్లితో సమానమైన వదినగారి ఆవేదనను చూడలేని రామలింగము తన అన్నగారి కోరిక మేరకు చదువుకొనుటకు అంగీకరించెను. తన వదిన తో చదువుకొనుటకు ఏకాంతముగా తనకు ఒక గది కావలెనని కోరెను. ఈ విషయమును ఆమె తన భర్తయైన సభాపతికి విన్నవించినది. సభాపతి ఆనందించి రామలింగమునకు ప్రత్యేకముగా ఒక గదిని కేటాయించెను. ఇంటిలోని మేడపై ఉన్న గదిని రామలింగమునకు తన చదువు మరియు అధ్యయనాలకు ఎటువంటి అంతరాయము లేకుండుట కొరకు కేటాయించిరి. ఇది వరకు ప్రపంచము అన్వయించిన విద్యా విధానముల వలె కాక రామలింగము యొక్క చదువు భిన్నముగా ఉండెను. సాహిత్య పుస్తకములను సేకరించి అధ్యయనము చేయుట మాని పూజా ధ్యానములకు వస్తువులను సేకరించెను. గదిలో ఒక దీపమును వెలిగించి దాని ఎదురుగా పెద్ద అద్దమును ఉంచెను.
ఆ అద్దము ముందు కూర్చొని దానిలో దీప వెలుగు కేంద్రీకృతమైన ప్రదేశమును చూచి, ధ్యానము చేయసాగెను. ఆ ధ్యాన ఫలముగా ఒక నాడు రామలింగమునకు సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యము ఆ అద్దములోనే లభించినది. ఆ దివ్య దర్శనం కలిగిన వెంటనే రామలింగమునకు తన మనస్సు, బుద్ధి, దేహము ఆత్మ అన్నియు దివ్యమైన తేజస్సు మరియు దివ్యానందమును సంతరించుకున్నది.
ఈ దర్శన వివరమును స్వామి వారు ఆయన వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంథములో ఈ విధముగా పొందుపరచియున్నారు.
சீர்கொண்ட தெய்வ வதனங்கள் ஆறும் திகழ்கடப்பந்
தார்கொண்ட பன்னிரு தோள்களும் தாமரைத் தாள்களும்ஓர்
கூர்கொண்ட வேலும் மயிலும்நற் கோழிக் கொடியும்அருட்
கார்கொண்ட வண்மைத் தணிகா சலமும்என் கண்ணுற்றதே
అనగా,
దైవత్వముతో నిండిన 6 వదనములు (ముఖములు), 12 భుజములు, ఒక పదునైన వేలాయుధము, వాహనమగు నెమలి, కోడి బొమ్మ కలిగిన జెండా, కృపా సాగరమగు తణిగాచలం (తిరుత్తణి కొండలు) నాకు సాక్షాత్కరించినవి.
ఏ విద్యాభ్యాసము లేకనే సకల విద్యాపారంగతుడై అన్ని కళలు, జ్ఞానములయందు దైవ కృపచే గొప్ప ప్రావీణ్యము పొందెను. ఈ విషయమును స్వామి వారు స్వయముగా తామే తిరు అరుట్పా లోని కీర్తనలలో పొందు పరచియున్నారు.
"குமாரப் பருவத்தில் என்னைக் கல்வியிற் பயிற்றும் ஆசிரியரை இன்றியே என் தரத்தில் பயின்று அறிதற்கு அருமையாகிய கல்விப் பயிற்சியை எனது உள்ளகத்தே இருந்து பயிற்றுவித்து அருளினீர்." - பெரு விண்ணப்பம்
"కుమార పర్వములో నన్ను ఏ గురువు లేకనే నా తరమునకు తగిన విధముగా అరుదైన దివ్య విద్యను నాలో నుండి నాకు బోధించితివి" - మహా విన్నపము
"பள்ளி பயிற்றாது என்தனைக் கல்வி பயிற்றி முழுதுணர்வித்து"
" పాఠకశాలలో విద్యాభ్యాసము చేయక నాకు నీవే విద్యాభ్యాసము చేసి అన్నింటినీ తెలియజేసితివి."
"ஓதுமறை முதற் கலைகள் ஓதாமல் உணர உணர்விலிருந்து உணர்த்தி"
" విద్యనభ్యసించి నేర్చుకొనవలసిన కళలన్నీ విద్యను అభ్యసించకనే నేర్చుకొనేలా నాలో నుండి నేర్పితివి"
"ஓதி உனர்ந்தவர் எல்லாம் எனை கேட்க எனைத்தான் ஓதாமல் உணர்ந்து"
"గొప్ప చదువులు చదివిన వారందరూ, నన్ను అడుగగా, నేను చదవకనే సకల జ్ఞానములను పొందేలా చేసితివి"
"ஒதாதுணர்ந்திட ஒளி அளித்தேனக்கே"
"విద్యను అభ్యసించకనే సకల జ్ఞానములను తెలుసుకోగల జ్ఞాన వెలుగును నాకు ప్రసాదించితివి"
పురాణ ప్రవచనము:
తమిళ సాహిత్యములో తనకున్న ప్రావీణ్యము మరియు వాగ్ధాటితో అన్న సభాపతి కొందరి సంపన్నుల ఇంట్లో వారి కోరిక మేరకు ప్రవచనములు చేయుచూ కొంత సంపదను వేతనముగా పొందుచుండెను. ఇది వారి కుటుంబ కర్చులకు చేయూతనిచ్చుచుండెను.
ఒక నాడు సభాపతిని ఊరి పెద్దైన సోము చెట్టియార్ తమ గృహములో కొన్ని దినములు పెరియ పురాణము ప్రవచనము చేయుటకు ఆహ్వానించిరి. ఈ ప్రవచనములు కొద్ది రోజులు సజావుగా సాగినది. ఒక రోజు సభాపతి తన అనారోగ్యము కారణముగా ఆ కార్యక్రమమునకు వెళ్ళలేక పోయెను. ప్రజలను, కార్యక్రమ నిర్వాహకులను నిరాశ పరచుటకు సభాపతికి ఇష్టము లేదు. ఏమి చేయాలో తెలియని స్థితిలో తన భార్య తన తమ్ముని జ్ఞానమును గురించి ఇది వరకే యెరిగినదై, రామలింగమును ప్రవచనము చేయుటకు పంపమని సలహా ఇచ్చెను.
సభాపతి తన తమ్ముని జ్ఞానమును గూర్చి ఎరుగక ఆమె సలహాను తిరస్కరించెను. కాని వేరొక ఉపాయము లేక చివరగా తన తమ్ముని పంపుటకు అంగీకరించెను. రామలింగమును పిలచి, ప్రేక్షకులకు ఒకటి లేదా రెండు పద్యములు చదివి వినిపించి, నిర్వాహకులకు తాను రాలేకపోయిన కారణమును విన్నవించి క్షమాపణ కోరమని చెప్పి పంపెను.
సభలో, తన సోదరుని పరిస్థితిని వివరించుటకు రామలింగము వెళ్ళినప్పుడు నిర్వాహకులు కొంత కలత చెందిరి. ప్రేక్షకులు గుమికూడి ఉన్న సమయమున, ప్రవచనము చేయు వారు లేక నిరాశ చెందిరి. ప్రేక్షకుల నుంచి ఎటువంటి గొడవలు జరుగక ముందే, వేరే ఉపాయము లేక అయిష్టతతో నిర్వాహకులు రామలింగమును తనకు వచ్చినది ఏదో ఒకటి చెప్పమని చెప్పెను. రామలింగము ప్రేక్షకుల ముందు కూర్చొని తన ప్రవచనమును ప్రారంభించినపుడు, అందరూ తనను చూసి ప్రవచన విషయము చాలా లోతైనది, కేవలము పండితులు, ఉన్నత విద్యలను అభ్యసించిన వారు మాత్రమే చెప్పగలరు, ఈ చిన్న వయసులో ఇతను ఏమి చెప్పగలడని ఆలోచించుచుంటిరి.
పెరియ పురాణము లోని మొదటి పదము ' ఉలగెలామ్ ' (ప్రపంచములన్నియూ) అను పదమును వ్యాఖ్యానమునకు తీసుకొనబడినది. రామలింగమునకు, వరద ప్రవాహములో ప్రవహించు నీటి వలె పదాలు వేగంగా తన మాటల రూపములో ప్రవహించెను. (ఉలగెలామ్ అను మాటకు వ్యాఖ్యానముగా వివిధ రకములైన ప్రపంచముల గురించిన వివరణ రామలింగ స్వామి వారు రచించిన గద్య భాగములో కలదు)
సభలో నిశ్శబ్ధము అలముకొని అందరూ ఆ బాలుని అసాధారణ వాగ్ధాటిని చూసి ఆశ్చర్యపడిరి. అర్థ రాత్రి అయినా, ఇంకా ఒక్క పద్యములోని కనీసము రెండు వాక్యములు కూడా పూర్తి కాలేదు. ప్రవచన అనర్ఘళముగా సాగుతోంది. ఒక్కొక్క పదమునకు వివరణ ప్రవాహము వలె సాగుతుండడముతో, సమయమును గురించి ఎవరూ చింతించలేదు. నిర్వాహకులు ప్రజలకు ఇబ్బంది కలుగునని ఆలోచించి, ప్రవచనమును ముగించి, రామలింగమును సత్కరించి ఇంటికి పంపెను.
కార్యక్రమ నిర్వాహకులు సోము సెట్టి గారు మరుసటి రోజు స్వయముగా సభాపతిని సందర్శించి యోగ క్షేమములు అడిగి తెలుసుకొని, ఇక పై వారి సోదరుడు రామలింగమునే ప్రవచనములు చేయుటకు పంపమని, ఇది ప్రజలందరి అభీష్టమని తెలిపిరి. సభాపతిని కూడా వచ్చి వారి తమ్ముని అనర్గళ ప్రవచనములను వీక్షించెదరని ఆహ్వానించిరి. సభాపతి ఆశ్చర్యచకితుడై, కనీసం బడికి కూడా వెళ్ళని వాడు ఇలా అందరి మన్ననలను పొంది, అనర్ఘళముగా ప్రవచనలు ఎలా చేయుచున్నాడు అని తనను తాను ప్రశ్నించుకొనెను.
తన సందేహమును నివృత్తి చేసుకొనుటకు, సభాపతి తానే స్వయముగా ప్రవచనమును వీక్షించుటకు వెళ్ళెను. సభా స్థలమునకు ఒక మూలగా, ఎవరూ గమనించని ప్రదేశములో నిలబడి తన సోదరుని ప్రవచనమును వినెను. మొదట కలగనుచున్నామని భ్రమించెను. కానీ తరువాత అది కల కాదు సత్యమని గ్రహించెను. నమ్మసఖ్యముకాని ఆ దివ్య ఆనందముతో ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా వివరించెను. రామలింగము సామాన్య బాలుడు కాదని, దైవానుగ్రహమని ఇరువరూ నిర్ధారించుకొనెను. రామలింగము కూడా అప్పుడే తన ప్రవచనమును ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చెను.
సభాపతి తాను రామలింగము పట్ల ప్రవర్తించిన తీరుకు కలత చెంది విచారము వ్యక్తము చేసెను. విధేయతతో కూడిన ఆప్యాయతతో రామలింగమును ఆలింగము చేసుకొనెను. ఈ వార్త చుట్టూ ఉన్న అనేక ప్రదేశాలకు ప్రభలి, ఆ బాలుని చూచుటకు, అతని ముఖములో నుండి వెలువడే పలుకులను వినుటకు ప్రజల రాసాగిరి.
రామలింగము తన అపూర్వ ఆధ్యాత్మిక ప్రవచనలతో ప్రజలను ఆకర్షించెను. ఆ ప్రవచనలకు ఆనందించి సంపన్నులు ఆయనకు సంపదలను, కానుకలను ఇచ్చిరి. కానీ రామలింగమునకు సిరి సంపదల పైన ఏ మాత్రము కోరిక లేదు. అభిమానముతో ప్రజలు ఇచ్చు కానుకలను కాదనలేక స్వీకరించి, దారిలోనున్న కొలనులో పారవేయుచుండెను.
గొప్ప పండితులు, మత బోధకులు రామలింగమునకు శిష్యులైరి. ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాసు లో తమిళ భాషా అధ్యాపకులు (ప్రొఫెసర్) గా ఉన్న తొళువూర్ వేలాయుధ ముదలియార్, రామలింగమును, తన ప్రావీణ్యతను పరీక్షించ దలచి, తానే స్వయముగా కొన్ని పద్యములను వ్రాసి, అవి తమిళ సంఘ కాల సాహిత్యములోని పాటలని, దానిని వివరించమని రామలింగమును కోరెను. కానీ రామలింగము దానిని చూచిన వెంటనే అది సంఘ కాల సాహిత్యము కాదని, దానిని వ్రాసినది ఒక అభ్యాసకుడు, కనుకనే ఇన్ని తప్పులు కలవు. సంఘ కాల సాహిత్యములలో ఇట్టి తప్పులు ఉండవని చెప్పెను. వేలాయుధము యొక్క గర్వము భంగమయ్యెను. రామలింగమునకు పాదాభివందనము చేసి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడెను. 1849 వ సం స్వామివారికి వేలాయుధము శిష్యుడయ్యెను. అప్పుడు స్వామివారి వయస్సు 26, వేలాయుధమునకు 17. అప్పటి నుండి రామలింగ స్వామి వారి ప్రధాన శిష్యులలో ఒకరిగా వేలాయుధము చిరస్థాయిని పొందెను.
వివాహము:
అన్న సభాపతి తన తమ్మునికి వివాహము చేయదలచెను. కాని రామలింగము అందుకు అంగీకరించలేదు. బంధు మిత్రులు కోరినా ఫలితము లేక పోయినది. చివరిగా కన్న తల్లి ఒక యోగీశ్వరుని హితబోధ చేయమని కోరగా ఆయన రామలింగమును వివాహమునకు అంగీకరింపజేసెను. కన్నతల్లిని, అన్నను బాధపెట్టలేక వివాహమునకు ఆయన అంగీకరించెను.
రామలింగము, తన అక్క ఉణ్ణామలై కుమార్తె ధనకోటి ని 1850వ సంవత్సరము వివాహమాడెను. వారి తొలి రాత్రి, ఆలూ మగల ఏకాంత సమయమున రామలింగము మాణిక్య వాసగర్ వ్రాసిన ' తిరు వాసగము ' ను తన భార్య ధనకోటి కి చదివి వినిపించెను. ఆ రాత్రంతయూ ఇది కొనసాగినది. ఆ రాత్రి రామలింగమునకు దైవ పారవశ్యమైన అనుభవముగా ఉండెను.
రోజులు గడిచిన కొద్దీ, రామలింగము వ్యక్తిత్వము మరియు జీవితము పరివర్తన చెంద సాగినది. తీర్థయాత్రలు చేయ సంకల్పించిన రామలింగము, తన భార్యను పిలచి, 'తిరు వాచకము' ను తన చేతికి ఇచ్చి, తాను తీర్థయాత్రలకు వెళ్ళుచున్నానని, ఇకపై ఆమె భక్తి మార్గమును అనుసరించి, దైవ కృపకు పాత్రురాలు కావలెనని హితోపదేశము చేసి తాను బయలుదేరెను.
తన 35 వ ఏట 1858 వ సం చెన్నైను విడిచి, వివిధ పుణ్యక్షేత్రములను దర్శించిన రామలింగము, చివరిగా చిదంబర క్షేత్రమును చేరుకొనెను. చిదంబరములో స్వామివారిని చూసిన కరుంగుళికి చెందిన వెంకట రెడ్డి తన గ్రామమునకు విచ్చేయమని కోరెను. స్వామివారు అందుకు అంగీకరించిరి. వెంకట రెడ్డి స్వామి వారిని భక్తి మర్యాదలతో తన గృహమునకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను తమ నివాస స్థలమును ఏర్పరచుకొని ఉండవలసినదిగా కోరెను.
ఆయన కోరికను మన్నించిన స్వామివారు, వెంకట రెడ్డి గృహములోనే ఉండుటకు అంగీకరించెను. కరుంగుళికి 1858 వ సం వచ్చిన స్వామి వారు 1867 వ సం వరకు అక్కడే ఉండిరి. ఈ కాలములో తరచూ, చిదంబర క్షేత్రమును దర్శించుచుండెను. తిరు అరుట్పా లోని 4 వ సంపుటి మరియు 6 వ సంపుటిలోని మొదటి సగ భాగము ఈ కాలములోనే వ్రాయబడినది. ఈ కాలములోనే నటరాజుని సంపూర్ణ అనుగ్రహము స్వామి వారికి లభించినది. నటరాజానుగ్రహము అనంతరము, రామలింగ స్వామి వారు సాంఘిక దురాచారాలను నిర్మూలించుటకు కృషి చేసెను. మానవుల యొక్క సకల దుఃఖములను తొలగించుటకు ఉపాయము కనుగొనవలెనని సంకల్పించెను.
జాతి, మత, కుల, భాషా విభేదాలే మానవులకు అతి పెద్ద అడ్డుగోడలని రామలింగము గ్రహించెను. వైదిక ఆధిపత్యమును సంపూర్ణముగా ఎదిరించెను. ముఖ్యముగా చిదంబర ఆలయములో వైదీక ఆధిపత్యమును తొలగించుటకు కృషి చేసెను. ఈ సంఘటన అక్కడ ఉన్న వేద పురోహితులను ఆగ్రహావంతులను చేసినది.
చిదంబరములో అప్పుడు ఉన్న పరిస్థితులను గమనించిన రామలింగము అక్కడ తాను అనుకున్నది చేయలేనని భావించి, సర్వ మానవాళి, ఏ కుల, మత, వర్ణ భేధములు లేకుండా నటరాజ స్వామిని కొలుచుటకు ఒక ప్రత్యేకమైన ఆలయమును చిదంబర క్షేత్రమునకు సమీపములోనే నిర్మించదలచిరి. ఇదే వడలూరు నందు నిర్మించిన సత్య జ్ఞాన సభ. అప్పటి పార్వతీపురముగా పిలువబడిన వడలూరులో స్వామి వారు సత్య జ్ఞాన సభను నిర్మించి ' దానిని ఉత్తర జ్ఞాన చిదంబరము' గా ప్రసిద్ధి గావించెను.
సమరస శుద్ధ సన్మార్గ సంఘము - 1865 :
వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి, సమరస శుద్ధ సన్మార్గ సంఘము అను ఒక మార్గమును 1865 వ సం కనుగొనిరి. ఈ సంఘము యొక్క ముఖ్య ఉద్దేశము,
1. భగవంతుడు ఒక్కడే, ఆయనను సత్యమైన ప్రేమతో, జ్యోతి స్వరూపములో కొలువవలెను.
2. చిరు దేవతలను పూజింపరాదు. ఆ దేవతల పేరుతో జంతు బలులు ఇవ్వరాదు. మాంసము భుజింపరాదు.
3. జాతి, కుల, మత భేదములు ఉండరాదు. అన్ని ప్రాణులను తమ ప్రాణముగా భావించి, ఆత్మ బంధుత్వ ఐకమత్యమును కలిగి ఉండవలెను.
4. పేదవారి ఆకలి తీర్చుట మొదలైన జీవకారుణ్య ప్రక్రియయే మోక్ష గృహమునకు తాళపు చెవి.
5. పురాణ, ఇతిహాస, శాస్త్రములు సంపూర్ణ సత్యమును తెలియజేయలేవు.
6. మరణించిన వారిని సమాధి చేయవలెను. అగ్నికి ఆహుతి చేయరాదు.
ఈ సూక్తులను అనుసరించి, అందరికీ తెలియజేయుటకే సమరస శుద్ధ సన్మార్గ సంఘమును స్వామి వారు 1865 వ సం ఎర్పరిచిరి.
తిరు అరుట్పా ప్రచురణ - 1867:
1867 వ సం తిరు అరుట్పా లోని మొదటి 4 సంపుటలు (తిరు మురై) ప్రచురితమైనవి.
సత్య ధర్మశాల - (23-05-1867):
వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి భోధనలలో ముఖ్యమైనది జీవకారుణ్యము. జీవకారుణ్యమును స్వామి వారు రెండు విధములుగా విభజించిరి. అవి,
1. ప్రాణులను వధింపరాదు మరియు మాంసాహారము భుజింపరాదు.
2. ఆకలితో ఉన్నవారికి ఆహారము ఇవ్వవలెను.
స్వామివారు ఆకలిని ఒక రోగముగా అభివర్ణించెను. ఆకలి బాధ భరించలేక, మానవుడు తనకున్న అన్నింటినీ పోగొట్టుకొనగలడు. మొదట ఆకలి తీర్చిన తరువాతనే మనిషి మంచి చెడులను గూర్చి ఆలోచించును. జ్ఞానము పొందుటకు, ముందు ఆకలి నుండి విముక్తి పొంద వలెనని తలచి, గ్రామస్థులు, శిష్య మిత్ర బృందము సహకారముతో వడలూరులో ధర్మశాలను నిర్మించిరి. ఇది 1867 వ సం మే నెల 23 వ తేదీన ప్రారంభమైనది. ధర్మశాలలో స్వామివారు అప్పుడు తమ స్వహస్తములతో వెలిగించిన పొయ్యి ఇప్పటికీ వేలుగుచూనే ఉన్నది. ప్రతి రోజూ వేల మంది పేద ప్రజలకు అన్నదానము జరుగుచున్నది. ధర్మశాల స్థాపనానంతరము, స్వామివారు 1870 వ సం వరకు అక్కడే నివశించిరి.
సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) - 1870:
ధర్మశాలలో ఉన్న స్వామివారు, అక్కడ రద్దీ పెరుగుటచే, ఏకాంతము కోరి, వడలూరునకు సమీపములో 5 కి. మీ. దూరములో ఉన్న మేట్టుకుప్పము అను ఒక కుగ్రామమునకు వెళ్ళి అక్కడే బస చేయుచుంటిరి.
మేట్టుకుప్పములో స్వామివారు నివశించిన ఆ భవనము సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) అని పిలువబడుచున్నది. ఈ పేరు స్వయముగా స్వామివారే ఆ భవనమునకు పెట్టిరి. సిద్ధిని ప్రసాదించు స్థలము అని దీని అర్థము.
1870 వ సం నుండి 1874 వ సం లో స్వామివారు సిద్ధి పొందుట వరకు ఎక్కువ సమయము ఇక్కడే గడిపిరి. సిద్ధి పొందినది కూడా ఇక్కడే.
సత్య జ్ఞాన సభ - (25-01-1872):
భగవంతుడిని అరుట్పెరుం జ్యోతి (దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి) స్వరూపములో దర్శించిన స్వామివారు, ఆ దివ్య అఖండ జ్యోతిని ఆరాధించుటకు వడలూరులో సత్య జ్ఞాన సభను ఏర్పరచిరి. 1871 వ సం సత్య జ్ఞాన సభను నిర్మించుటకు ప్రారంభించిరి.
1872 వ సం జనవరి 25 వ తేదీన, గురువారము, పుష్యమి నక్షత్రమున మొదటి సారి సభలో ఆరాధనలు మొదలైనవి. ప్రజలందరూ దివ్య అఖండ జ్యోతిని దర్శించుకొని, ఆనంద పారవశ్యులైరి. సత్య జ్ఞాన సభ ప్రకృతి వివరణ అని స్వామి వారు చెప్పుచుండిరి.
ఆంతరంగికములో చూడవలసిన అనుభవములనే బాహ్యములో సత్య జ్ఞాన సభలో భావనా రూపములో చూపబడినది. మనలోని అరుట్పెరుం జ్యోతి మాయా తెరలచే కప్పబడియున్నది. వాటిలో ప్రధానమైనవి వేరు వేరు వర్ణములలో ఉన్న 7 తెరలు. మనలో ఉన్న అజ్ఞానమను ఈ తెరలు తొలగినపుడు, అరుట్పెరుం జ్యోతిని దర్శించగలము. ఇదే దీని సారాంశము. ఆంతరంగికమున తాము పొందిన అరుట్పెరుం జ్యోతి అనుభవమును, బాహ్యములో సభ రూపములో స్వామి వారు నిర్మించిరి.
సన్మార్గ జెండా - (22-10-1873):
వాళ్లలార్ తమ మార్గమునకు ఒక ప్రత్యేకమైన జెండాను కనుగొంటిరి. ఈ జెండాకు సన్మార్గ కొడి (సన్మార్గ జెండా) అను పేరు కలదు. పసుపు, తెలుపు రంగులలో ఉన్న ఈ జెండాను, మేట్టుకుప్పము, సిద్ధి వళాగ ప్రాంగణములో, 1873 వ సం అక్టోబర్ 22 వ తేదీన మంగళవారము, ఉదయము 8 గంటలకు మొట్టమొదటి సారిగా, జెండాను కట్టి ఆవిష్కరించిరి. ఆ తరువాత ఒక గొప్ప ఉపన్యాసము చేసి అనుగ్రహించిరి. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి సంపూర్ణ సిద్దాంతములను పొందుపరచిన ఆ ఉపదేశము మహోపదేశము - పేరుపదేశము అని చెప్పబడుచున్నది.
మరణము లేని మహర్జీవితము - రామలింగ స్వామి వారి అదృశ్యము (30-01-1874):
శుద్ధ సన్మార్గము యొక్క అంతిమ లక్ష్యము మరణమును జయించుటయే. మరణమును జయించిన వాడే సన్మార్గి అనునది స్వామి వారి ఉపదేశము.
"என் மார்க்கம் இறப்பொழிக்கும் சன்மார்க்கம் தானே"
"నా మార్గము, మరణమును నిర్మూలించు సన్మార్గమే కదా"
అనునది స్వామి వారి వాక్కు. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు శుద్ధ దేహము, ప్రణవ దేహము, జ్ఞాన దేహము అను త్రిదేహ సిద్ధిని పొందిరి. దేహ సిద్ధి పొందిన వారి శరీరము సమాధి కాజాలదు. వారి భౌతిక శరీరము కాంతి స్వరూపముగా మారును. నిత్య దేహము పొందెదరు.
అట్టి నిత్య దేహమును పొందిన శ్రీ జ్యోతి రామలింగ స్వామి, 1874 వ సం జనవరి నెల 30 వ తేదీన శుక్రవారము పుష్యమి నక్షత్రమున అర్థరాత్రి 12 గంటల సమయమున సిద్ధి వళాగమున తమ గది లోనికి ప్రవేశించి అదృశ్యమైరి.
" அருட்சோதி ஆனேன்என்று அறையப்பா முரசு
அருளாட்சி பெற்றேன்என்று அறையப்பா முரசு
மருட்சார்பு தீர்ந்தேன்என்று அறையப்பா முரசு
மரணந்த விர்ந்தேன்என்று அறையப்பா முரசு. "
అనగా,
" అనుగ్రహ అఖండ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) అయ్యాను నేను
అనుగ్రహ పాలన పొందాను నేను
అజ్ఞానమను అంధకారమును నిర్మూలించితిని నేను
మరణమును జయించాను నేను "
" காற்றாலே, புவியாலே, ககனமதனாலே,
పంచభూత స్థలములలో ఒకటైన చిదంబర క్షేత్రమునకు అతి సమీపములోని మరుదూరు అనే కుగ్రామములో రామయ్య పిళ్ళై మరియు చిన్నమ్మ అను దంపతులు ఉండిరి. వారు శైవ కుటుంబీకులు. రామయ్య పిళ్ళై ఊరి కరణముగా ఉండిరి. వీరు నలుగురు సంతానమును కలిగి ఉండిరి. వారు సభాపతి, పరసురామన్, సుందరాంబాళ్ మరియు ఉణ్ణామలై .
ఒక నాడు ఒక యోగీశ్వరుడు, రామయ్య చిన్నమ్మల గృహమునకు విచ్చేసిరి. ఆ దంపతులు ఇరువరు వారిని అతిధి సత్కారములతో సత్కరించిరి. ఆ యోగీశ్వరుడు చిన్నమ్మను, ఒక దివ్య పురుషునికి తల్లి కాగలవని ఆశీర్వదించి విభూతిని ప్రసాదించెను.
ఆ తరువాత చిన్నమ్మ రామయ్య దంపతులకు ఐదవ సంతానముగా 1823 వ సంవత్సరం అక్టోబర్ 5 వ తేది ఆదివారము రామలింగ స్వామి వారు జన్మించిరి .
ఈ జననము యథేచ్చగా జరిగినది కాదు. సర్వ మానవాళి ఉన్నత స్థాయిని అధిరోహించుటకు, సత్యమును బోధించి దివ్య జీవనము పొందు మార్గమును ఉపదేశించి వారికి మార్గ నిర్దేశము చేయుటకు ఆ పరమాత్ముడు తనను ఈ భూ మండలములో జనియింప చేసాడని శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారే స్వయముగా ఈ విధముగా తెలియజేసి ఉన్నారు.
" அகத்தே கருத்துப் புறத்து வெளுத்து இருந்த உலகர் அனைவரையும்
சகத்தே திருத்திச் சன்மார்க்க சங்கத்து அடைவித்திடவும் அவரும்
இகத்தே பரத்தைப் பெற்று மகிழ்ந்திடுதற்கு என்றே எனை இந்த
யுகத்தே இறைவன் வருவிக்க உற்றேன் அருளைப் பெற்றேனே ! "
అనగా,
అంతరంగమున అజ్ఞానమను అంధకారమును, బాహ్యమున అందము మరియు సకల సంపదలు పొంది ఉన్న వారి వలె ఉన్న ఈ జనులందరినీ ఈ జగత్తులోనే వారి తప్పులను సరిదిద్ది, సన్మార్గ సంఘములో చేరి వారు కూడా ఇహమున పరమును అనగా ఈ భూమినే స్వర్గముగా చేసుకొని పరమానందమును పొందుటకే నేను ఈ యుగములో ఆ భగవంతునిచే ఇచ్చటకు రప్పించబడి, ఆయన కృపకు పాత్రుడనైతిని.
- తిరు అరుట్పా
- తిరు అరుట్పా
చిదంబర దర్శనము:
ఐదు నెలల శిశు ప్రాయములో వారి తల్లిదండ్రులు దైవ దర్శనానికై స్వామివారిని చిదంబరమునకు తీసుకొని వెళ్ళిరి. చిదంబర ఆలయములో గర్భ గుడిలోని దైవ దర్శనము అనంతరము చిదంబర రహస్యమను చిత్ అంబర దర్శనమును చూపించెదరు. ఇది ఇప్పటికీ ఆ ఆలయములో గల ప్రధాన సాంప్రదాయము. ఇదే నిజమైన చిదంబర ఆలయ దర్శనము. ఆ చిదంబర రహస్య దర్శనము గావించుచుండగా, దానిని చూసిన ఐదు నెలల పసికందు అయిన రామలింగము పక పక నవ్వుచూ కేరింతలు కొట్టి ఆనందించెను. దీనిని చూసిన ఆలయ అర్చకులు ఈ బిడ్డ సామాన్యుడు కాడని, సాక్షాత్తు ఆ నటరాజుని కుమారుడని ఆశ్చర్యపడి, ఆ దంపతులను వారి ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి, ఆశీర్వదించి పంపిరి. ఈ దర్శన వివరమును స్వామి వారు తమ 49 వ ఏట తాము వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంధములో ఈ విధముగా పొందు పరచియున్నారు.
" தாய் முதலோரோடு சிறு பருவத்தில் தில்லைத்
தலத்திடையே திரை தூக்கித் தரிசித்த போது
மேய் வகைமேல் காட்டாதே என்தனக்கே எல்லாம்
வெளியாகக் காட்டிய என் மெய்யுருவாம் பொருளே
காய்வகை இல்லாது உளத்தே கனிந்த நறுங்கனியே
கனவிடத்தும் நனவிடத்தும் எனைப்பிரியாக் களிப்பே
தூய்வகையோர் போற்ற மணி மன்றில் நடம் புரியுஞ்
ஜோதி நடத்தரசே என் சொல்லும் அணிந்தருளே ! "
అనగా,
తల్లి మొదలైన వారితో చిరు ప్రాయమున చిదంబర క్షేత్రమున తెరను తీసి దర్శించినప్పుడు అంతటా శూన్యమును, ఆకాశమును చూపిన నా సత్య స్వరూపమా
నా హృదయములో ఫలించిన సుఫలమా
స్వప్నములోనూ మెలకువలోనూ నన్ను వీడని ఆనందమా
స్వచ్ఛమైన వారు ప్రశంసించుచుండగా ఛిదాకాసములో నాట్యమాడు
జ్యోతి నటరాజా నా మాటలను ఆలకించి అనుగ్రహించుము.
బాల్యము:
చిదంబర దర్శనానంతరం ఆలయములో కలిగిన అనుభవముతో దైవానుగ్రహము పొందిన ఆనందోత్సాహములు ముగియక ముందే ఒక నెల సమయములోనే స్వామివారి తండ్రి రామయ్య పిళ్ళై మరణించెను.
ఒంటరిగా పిల్లలను పెంచే స్థోమత లేక తన ఐదుగురు పిల్లలతో కలిసి మరుదూరును వదలి తన పుట్టినిల్లయిన చెంగల్పట్టు జిల్లా లోని చిన్నక్కావనము అను గ్రామములో ఆశ్రయము పొందెను.
కొన్ని సంవత్సరములు గడిచి పెద్ద కుమారుడైన సభాపతి పెద్ద వాడై కుటుంబ భారమును తనపై స్వీకరించెను. కుటుంబమును పోషించుటకు గొప్ప అవకాసములను చెన్నై పట్టణము తనకు కలిగించునని సభాపతి గ్రహించెను. ఆ కుటుంబము చిన్నక్కావనమును వదిలి చెన్నై పట్టణములో స్థిర పడెను.
స్వామివారు జన్మించిన మరుదూరు గ్రామములోని వారి స్వగ్రుహము తరువాత కాలములో ప్రార్థనా స్థలముగా పరిగణించబడెను. ప్రతి ఏటా తై పూస దినమున ప్రజలందరూ అక్కడ చేరి ప్రార్థనలు నిర్వహించెదరు.
విద్యాభ్యాసము మరియు పసి ప్రాయము:
చెన్నై పట్టణములో అన్న సభాపతి గొప్ప పండితులైన కంచి సభాపతి నావలార్ వద్ద తమిళ సాహిత్యమును అభ్యసించెను. ఆ పాండిత్యముచే కొంతమంది సీమంతుల సహకారముతో సభాపతి పురాణ, మత ప్రవచనలు గావించి సంపాదనను పొంది కుటుంబమును పోషించుచుండెను. ఇతర సమయములలో బాలురకు ప్రాథమిక విద్యను బోధించుచుండెను.
రామలింగమునకు అపుడు 5 సంవత్సరములు. అన్న సభాపతి ఒక గురువు గా తన తమ్మునికి తమిళ సాహిత్యములోని ప్రాథమిక విషయములను బోధించుటకు ప్రయత్నించెను. రామలింగం విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపకుండెను. సభాపతి, కాలక్రమేణా తన సోదరుడు ఆశక్తి చూపగలడని ఆశించెను. అయినప్పటికీ ఆ బాలుడు విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపక చెన్నై జార్జ్ టౌన్ లోని కందకోట్టం అను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయమునకు వెళ్లి దైవ ప్రార్థనలో మునిగియుండెను. తన సోదరుని వద్ద విద్యను అభ్యసించ ఆశక్తి చూపని బాలుడు పరుల వద్దనైననూ అభ్యసించునని ఆలోచించి సభాపతి తాను విద్య నేర్చుకున్న తన గురువు గారైన కంచి సభాపతి గారి వద్దనే తన సోదరుడు విద్యను అభ్యసించుటకు రామలింగమును ఆయనకు అప్పగించెను.
తనకున్న తమిళ సాహిత్య ప్రావీణ్యముతో రామలింగామును విద్యావంతుడను చేయుటకు గురువు ఎంతగానో ప్రయత్నించిననూ అతను ఏ విధముగానూ విద్య పట్ల ఆశక్తి ప్రదర్శించలేదు. ఎల్లప్పుడూ కందకొట్ట ఆలయమును దర్శించి, సుబ్రహ్మణ్య స్వామిని గూర్చి భక్తి గీతములను ఆలపించి ధ్యానము చేయుచుండెను.
ఒక నాడు గురువు గారు తమిళ వాచకము లోని నీతి వాక్యమును ఈ క్రింది విధముగా బోధించుచుండిరి.
ஓதாமல் ஒருநாளும் இருக்க வேண்டாம்
ஒருவரையும் பொல்லாங்கு சொல்லவேண்டாம்
மாதாவை ஒருநாளும் மறக்க வேண்டாம்
ఓదామల్ ఒరు నాళుం ఇరుక్క వేండాం
ఒరువరయుం పోల్లాంగు సొల్ల వేండాం
మాతావై ఒరు నాళుం మరక్క వేండాం
అనగా,
చదువకుండా ఏ రోజూ ఉండవద్దు
ఎవ్వరినీ చెడు మాటలు అనవద్దు
తల్లిని ఏ రోజూ మరువ వద్దు
ఇందుకు రామలింగము " అయ్యా! ఇట్లు వేండాం వేండాం (వద్దు వద్దు) అంటుంటే పిల్లలమైన మాకు అందులో ఏదో రహస్యము దాగి ఉంది అను భావన కలుగుట సహజము కనుక కావలెను అంటే దానిని కోరి చేయుట సహజముగా ఉండును." అని చెప్పి తాను నిత్యము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి తానే స్వయముగా రాసి ఆలాపించే "దైవమణి మాల" అను అధ్యాయము లోని ఒక కీర్తనను తన గురువు గారికి క్రింది విధముగా వినిపించెను.
ஒருமையுடன் நினது திரு மலரடி நினைக்கின்ற
உத்தமர் தம் உறவு வேண்டும்
உள்ளொன்று வைத்துப் புறம்பொன்று பேசுவார்
உறவு கலவாமை வேண்டும்
பெருமை பெறு நினது புகழ் பேச வேண்டும்
பொய்மை பேசாது இருக்க வேண்டும்
பெரு நெறி பிடித்தொழுக வேண்டும்
மதமான பேய் பிடியாதிருக்க வேண்டும்
மருவு பெண்ணாசையை மறக்கவே வேண்டும்
உனை மறவாதிருக்க வேண்டும்
மதி வேண்டும்; நின் கருணை நிதி வேண்டும்
நோயற்ற வாழ்வில் நான் வாழ வேண்டும்
ఒరుమయుడన్ నినదు తిరు మలరడి నినైక్కిండ్ర
ఉత్తమర్ తం ఉరవు వేండుం
ఉల్లొండ్రు వైత్తు పురం ఒండ్రు పెసువార్
ఉరవు కలవామై వేండుం
పెరుమై పెరు నినదు పుగళ్ పేస వేండుం
పోయిమై పేసాదు ఇరుక్క వేండుం
పెరు నెరి పిడిత్తోళుగ వేండుం
మదమాన పేయి పిడియాదిరుక్క వేండుం
మరువు పెన్నాశయై మరక్కవే వేండుం
ఉనై మరవాదిరుక్క వేండుం
మది వేండుం, నిన్ కరుణై నిధి వేండుం
నోయట్ర వాళ్విల్ నాన్ వాళ వేండుం
అనగా,
ఏకాగ్రతతో నీ పాదపద్మములను స్మరించు
ఉత్తముల అనుబంధము కావలెను
లోన ఒకటి తలచి బయటకు వేరొకటి మాట్లాడు
జనుల అనుభంధము కలుగని వరము కావలెను
గొప్పవైన నీ గొప్పతనమును
ఎల్లప్పుడూ మాటలాడుచుండవలెను
అబద్ధములాడుట మానవలెను
నిజమైన భక్తి మార్గములో
నిన్ను ఆరాధించవలెను
నిను మరువని గుణము కలిగి ఉండవలెను
మంచి బుద్ధికుశలత కలుగ వలెను
నీ కరుణామృతము కైకొనవలెను
బాధలు, రోగము లేని జీవితము
నేను గడుపవలెను
ఈ మాటలకు గురువుగారు ఈ విద్యార్థి యొక్క జ్ఞానమును ప్రశంసించి ఇతనికి విద్యనేర్పుటకు తాను అసమర్థుడనని, అన్నగారైన సభాపతిపిళ్ళై గారికి చెప్పి తమ్ముడైన రామలింగమును అప్పజెప్పెను. గురువుని ఎదిరించు జ్ఞానము కలిగినవాడా నీవు? అని తమ్ముని అన్న మందలించెను. ఆనాటి నుండి రామలింగము విద్యనభ్యసించుట మానుకొని పుణ్యక్షేత్రములను సందర్శించుచూ తిరుగుచుండెను.
దీనిని చూసిన అన్న సభాపతి కలతచెంది కోపముతో రామలింగమునకు అన్నపానీయములను ఇవ్వక ఇంటి నుండి వెలివేసెను. సభాపతి తీసుకొన్న అంతటి కఠిన నిర్ణయము కుడా అతనికి ఆశించిన ఫలితమును ఇవ్వలేదు.
దీనికి విరుద్ధముగా రామలింగము పూర్తిగా దైవ భక్తిలో నిమఘ్నమై ఎల్లప్పుడూ దైవ ప్రార్థన, ధ్యానములలో మునిగియుండెను. రోజులు గడిచినవి. వదినగారైన పాప్పాత్తి అమ్మాళ్ తాను తన కన్న బిడ్డలా పెంచుకొంటున్న రామలింగము పడు కష్టములను చూసి బాధపడెను.
ఒక నాడు ఆమె కన్నీరు పర్యంతమై రామలింగాముతో బుద్ధిగా చదువుకొని అన్నగారి మనసు నొప్పక నడుచుకొనవలెనని వేడుకొనెను. తల్లితో సమానమైన వదినగారి ఆవేదనను చూడలేని రామలింగము తన అన్నగారి కోరిక మేరకు చదువుకొనుటకు అంగీకరించెను. తన వదిన తో చదువుకొనుటకు ఏకాంతముగా తనకు ఒక గది కావలెనని కోరెను. ఈ విషయమును ఆమె తన భర్తయైన సభాపతికి విన్నవించినది. సభాపతి ఆనందించి రామలింగమునకు ప్రత్యేకముగా ఒక గదిని కేటాయించెను. ఇంటిలోని మేడపై ఉన్న గదిని రామలింగమునకు తన చదువు మరియు అధ్యయనాలకు ఎటువంటి అంతరాయము లేకుండుట కొరకు కేటాయించిరి. ఇది వరకు ప్రపంచము అన్వయించిన విద్యా విధానముల వలె కాక రామలింగము యొక్క చదువు భిన్నముగా ఉండెను. సాహిత్య పుస్తకములను సేకరించి అధ్యయనము చేయుట మాని పూజా ధ్యానములకు వస్తువులను సేకరించెను. గదిలో ఒక దీపమును వెలిగించి దాని ఎదురుగా పెద్ద అద్దమును ఉంచెను.
ఆ అద్దము ముందు కూర్చొని దానిలో దీప వెలుగు కేంద్రీకృతమైన ప్రదేశమును చూచి, ధ్యానము చేయసాగెను. ఆ ధ్యాన ఫలముగా ఒక నాడు రామలింగమునకు సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యము ఆ అద్దములోనే లభించినది. ఆ దివ్య దర్శనం కలిగిన వెంటనే రామలింగమునకు తన మనస్సు, బుద్ధి, దేహము ఆత్మ అన్నియు దివ్యమైన తేజస్సు మరియు దివ్యానందమును సంతరించుకున్నది.
ఈ దర్శన వివరమును స్వామి వారు ఆయన వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంథములో ఈ విధముగా పొందుపరచియున్నారు.
சீர்கொண்ட தெய்வ வதனங்கள் ஆறும் திகழ்கடப்பந்
தார்கொண்ட பன்னிரு தோள்களும் தாமரைத் தாள்களும்ஓர்
கூர்கொண்ட வேலும் மயிலும்நற் கோழிக் கொடியும்அருட்
கார்கொண்ட வண்மைத் தணிகா சலமும்என் கண்ணுற்றதே
అనగా,
దైవత్వముతో నిండిన 6 వదనములు (ముఖములు), 12 భుజములు, ఒక పదునైన వేలాయుధము, వాహనమగు నెమలి, కోడి బొమ్మ కలిగిన జెండా, కృపా సాగరమగు తణిగాచలం (తిరుత్తణి కొండలు) నాకు సాక్షాత్కరించినవి.
ఏ విద్యాభ్యాసము లేకనే సకల విద్యాపారంగతుడై అన్ని కళలు, జ్ఞానములయందు దైవ కృపచే గొప్ప ప్రావీణ్యము పొందెను. ఈ విషయమును స్వామి వారు స్వయముగా తామే తిరు అరుట్పా లోని కీర్తనలలో పొందు పరచియున్నారు.
"குமாரப் பருவத்தில் என்னைக் கல்வியிற் பயிற்றும் ஆசிரியரை இன்றியே என் தரத்தில் பயின்று அறிதற்கு அருமையாகிய கல்விப் பயிற்சியை எனது உள்ளகத்தே இருந்து பயிற்றுவித்து அருளினீர்." - பெரு விண்ணப்பம்
"కుమార పర్వములో నన్ను ఏ గురువు లేకనే నా తరమునకు తగిన విధముగా అరుదైన దివ్య విద్యను నాలో నుండి నాకు బోధించితివి" - మహా విన్నపము
"பள்ளி பயிற்றாது என்தனைக் கல்வி பயிற்றி முழுதுணர்வித்து"
" పాఠకశాలలో విద్యాభ్యాసము చేయక నాకు నీవే విద్యాభ్యాసము చేసి అన్నింటినీ తెలియజేసితివి."
"ஓதுமறை முதற் கலைகள் ஓதாமல் உணர உணர்விலிருந்து உணர்த்தி"
" విద్యనభ్యసించి నేర్చుకొనవలసిన కళలన్నీ విద్యను అభ్యసించకనే నేర్చుకొనేలా నాలో నుండి నేర్పితివి"
"ஓதி உனர்ந்தவர் எல்லாம் எனை கேட்க எனைத்தான் ஓதாமல் உணர்ந்து"
"గొప్ప చదువులు చదివిన వారందరూ, నన్ను అడుగగా, నేను చదవకనే సకల జ్ఞానములను పొందేలా చేసితివి"
"ஒதாதுணர்ந்திட ஒளி அளித்தேனக்கே"
"విద్యను అభ్యసించకనే సకల జ్ఞానములను తెలుసుకోగల జ్ఞాన వెలుగును నాకు ప్రసాదించితివి"
పురాణ ప్రవచనము:
తమిళ సాహిత్యములో తనకున్న ప్రావీణ్యము మరియు వాగ్ధాటితో అన్న సభాపతి కొందరి సంపన్నుల ఇంట్లో వారి కోరిక మేరకు ప్రవచనములు చేయుచూ కొంత సంపదను వేతనముగా పొందుచుండెను. ఇది వారి కుటుంబ కర్చులకు చేయూతనిచ్చుచుండెను.
ఒక నాడు సభాపతిని ఊరి పెద్దైన సోము చెట్టియార్ తమ గృహములో కొన్ని దినములు పెరియ పురాణము ప్రవచనము చేయుటకు ఆహ్వానించిరి. ఈ ప్రవచనములు కొద్ది రోజులు సజావుగా సాగినది. ఒక రోజు సభాపతి తన అనారోగ్యము కారణముగా ఆ కార్యక్రమమునకు వెళ్ళలేక పోయెను. ప్రజలను, కార్యక్రమ నిర్వాహకులను నిరాశ పరచుటకు సభాపతికి ఇష్టము లేదు. ఏమి చేయాలో తెలియని స్థితిలో తన భార్య తన తమ్ముని జ్ఞానమును గురించి ఇది వరకే యెరిగినదై, రామలింగమును ప్రవచనము చేయుటకు పంపమని సలహా ఇచ్చెను.
సభాపతి తన తమ్ముని జ్ఞానమును గూర్చి ఎరుగక ఆమె సలహాను తిరస్కరించెను. కాని వేరొక ఉపాయము లేక చివరగా తన తమ్ముని పంపుటకు అంగీకరించెను. రామలింగమును పిలచి, ప్రేక్షకులకు ఒకటి లేదా రెండు పద్యములు చదివి వినిపించి, నిర్వాహకులకు తాను రాలేకపోయిన కారణమును విన్నవించి క్షమాపణ కోరమని చెప్పి పంపెను.
సభలో, తన సోదరుని పరిస్థితిని వివరించుటకు రామలింగము వెళ్ళినప్పుడు నిర్వాహకులు కొంత కలత చెందిరి. ప్రేక్షకులు గుమికూడి ఉన్న సమయమున, ప్రవచనము చేయు వారు లేక నిరాశ చెందిరి. ప్రేక్షకుల నుంచి ఎటువంటి గొడవలు జరుగక ముందే, వేరే ఉపాయము లేక అయిష్టతతో నిర్వాహకులు రామలింగమును తనకు వచ్చినది ఏదో ఒకటి చెప్పమని చెప్పెను. రామలింగము ప్రేక్షకుల ముందు కూర్చొని తన ప్రవచనమును ప్రారంభించినపుడు, అందరూ తనను చూసి ప్రవచన విషయము చాలా లోతైనది, కేవలము పండితులు, ఉన్నత విద్యలను అభ్యసించిన వారు మాత్రమే చెప్పగలరు, ఈ చిన్న వయసులో ఇతను ఏమి చెప్పగలడని ఆలోచించుచుంటిరి.
పెరియ పురాణము లోని మొదటి పదము ' ఉలగెలామ్ ' (ప్రపంచములన్నియూ) అను పదమును వ్యాఖ్యానమునకు తీసుకొనబడినది. రామలింగమునకు, వరద ప్రవాహములో ప్రవహించు నీటి వలె పదాలు వేగంగా తన మాటల రూపములో ప్రవహించెను. (ఉలగెలామ్ అను మాటకు వ్యాఖ్యానముగా వివిధ రకములైన ప్రపంచముల గురించిన వివరణ రామలింగ స్వామి వారు రచించిన గద్య భాగములో కలదు)
సభలో నిశ్శబ్ధము అలముకొని అందరూ ఆ బాలుని అసాధారణ వాగ్ధాటిని చూసి ఆశ్చర్యపడిరి. అర్థ రాత్రి అయినా, ఇంకా ఒక్క పద్యములోని కనీసము రెండు వాక్యములు కూడా పూర్తి కాలేదు. ప్రవచన అనర్ఘళముగా సాగుతోంది. ఒక్కొక్క పదమునకు వివరణ ప్రవాహము వలె సాగుతుండడముతో, సమయమును గురించి ఎవరూ చింతించలేదు. నిర్వాహకులు ప్రజలకు ఇబ్బంది కలుగునని ఆలోచించి, ప్రవచనమును ముగించి, రామలింగమును సత్కరించి ఇంటికి పంపెను.
కార్యక్రమ నిర్వాహకులు సోము సెట్టి గారు మరుసటి రోజు స్వయముగా సభాపతిని సందర్శించి యోగ క్షేమములు అడిగి తెలుసుకొని, ఇక పై వారి సోదరుడు రామలింగమునే ప్రవచనములు చేయుటకు పంపమని, ఇది ప్రజలందరి అభీష్టమని తెలిపిరి. సభాపతిని కూడా వచ్చి వారి తమ్ముని అనర్గళ ప్రవచనములను వీక్షించెదరని ఆహ్వానించిరి. సభాపతి ఆశ్చర్యచకితుడై, కనీసం బడికి కూడా వెళ్ళని వాడు ఇలా అందరి మన్ననలను పొంది, అనర్ఘళముగా ప్రవచనలు ఎలా చేయుచున్నాడు అని తనను తాను ప్రశ్నించుకొనెను.
తన సందేహమును నివృత్తి చేసుకొనుటకు, సభాపతి తానే స్వయముగా ప్రవచనమును వీక్షించుటకు వెళ్ళెను. సభా స్థలమునకు ఒక మూలగా, ఎవరూ గమనించని ప్రదేశములో నిలబడి తన సోదరుని ప్రవచనమును వినెను. మొదట కలగనుచున్నామని భ్రమించెను. కానీ తరువాత అది కల కాదు సత్యమని గ్రహించెను. నమ్మసఖ్యముకాని ఆ దివ్య ఆనందముతో ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా వివరించెను. రామలింగము సామాన్య బాలుడు కాదని, దైవానుగ్రహమని ఇరువరూ నిర్ధారించుకొనెను. రామలింగము కూడా అప్పుడే తన ప్రవచనమును ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చెను.
సభాపతి తాను రామలింగము పట్ల ప్రవర్తించిన తీరుకు కలత చెంది విచారము వ్యక్తము చేసెను. విధేయతతో కూడిన ఆప్యాయతతో రామలింగమును ఆలింగము చేసుకొనెను. ఈ వార్త చుట్టూ ఉన్న అనేక ప్రదేశాలకు ప్రభలి, ఆ బాలుని చూచుటకు, అతని ముఖములో నుండి వెలువడే పలుకులను వినుటకు ప్రజల రాసాగిరి.
రామలింగము తన అపూర్వ ఆధ్యాత్మిక ప్రవచనలతో ప్రజలను ఆకర్షించెను. ఆ ప్రవచనలకు ఆనందించి సంపన్నులు ఆయనకు సంపదలను, కానుకలను ఇచ్చిరి. కానీ రామలింగమునకు సిరి సంపదల పైన ఏ మాత్రము కోరిక లేదు. అభిమానముతో ప్రజలు ఇచ్చు కానుకలను కాదనలేక స్వీకరించి, దారిలోనున్న కొలనులో పారవేయుచుండెను.
గొప్ప పండితులు, మత బోధకులు రామలింగమునకు శిష్యులైరి. ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాసు లో తమిళ భాషా అధ్యాపకులు (ప్రొఫెసర్) గా ఉన్న తొళువూర్ వేలాయుధ ముదలియార్, రామలింగమును, తన ప్రావీణ్యతను పరీక్షించ దలచి, తానే స్వయముగా కొన్ని పద్యములను వ్రాసి, అవి తమిళ సంఘ కాల సాహిత్యములోని పాటలని, దానిని వివరించమని రామలింగమును కోరెను. కానీ రామలింగము దానిని చూచిన వెంటనే అది సంఘ కాల సాహిత్యము కాదని, దానిని వ్రాసినది ఒక అభ్యాసకుడు, కనుకనే ఇన్ని తప్పులు కలవు. సంఘ కాల సాహిత్యములలో ఇట్టి తప్పులు ఉండవని చెప్పెను. వేలాయుధము యొక్క గర్వము భంగమయ్యెను. రామలింగమునకు పాదాభివందనము చేసి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడెను. 1849 వ సం స్వామివారికి వేలాయుధము శిష్యుడయ్యెను. అప్పుడు స్వామివారి వయస్సు 26, వేలాయుధమునకు 17. అప్పటి నుండి రామలింగ స్వామి వారి ప్రధాన శిష్యులలో ఒకరిగా వేలాయుధము చిరస్థాయిని పొందెను.
చెన్నైలోని తిరువొట్రియూర్ నందు గల వడివుడై అమ్మ సమేత త్యాగరాజ స్వామి ఆలయమునకు ప్రతి రోజూ నిత్యము వెళ్లి రామలింగ స్వామి వారు దర్శించుచుండెను. అమ్మవారికి వారే స్వయముగా తిరు అరుట్పా లోని మొదటి సంపుటి లోని "వడివుడై మాణిక్య మాల " అను పేరుతో కీర్తనలను వ్రాసిరి. "ఇంగిత మాల", రెండవ సంపుటిలోని చాలా భాగము, మూడవ సంపుటి పూర్తిగా తిరువొట్రియూర్ క్షేత్రము నుండి పాడినవే.
ఒక నాడు తిరువొట్రియూర్ వెళ్లి చెన్నైకి ఆలశ్యముగా వచ్చి తన సోదరి ఇంటి బయట అరుగు మీద ఆకలితో పడుకున్న రామలింగమునకు, ఆ వడివుడై అమ్మవారే స్వయముగా తన సోదరి రూపములో వచ్చి తన అమృత హస్తములతో భోజనము ప్రసాదించెను.
ఒక నాడు తిరువొట్రియూర్ వెళ్లి చెన్నైకి ఆలశ్యముగా వచ్చి తన సోదరి ఇంటి బయట అరుగు మీద ఆకలితో పడుకున్న రామలింగమునకు, ఆ వడివుడై అమ్మవారే స్వయముగా తన సోదరి రూపములో వచ్చి తన అమృత హస్తములతో భోజనము ప్రసాదించెను.
వివాహము:
అన్న సభాపతి తన తమ్మునికి వివాహము చేయదలచెను. కాని రామలింగము అందుకు అంగీకరించలేదు. బంధు మిత్రులు కోరినా ఫలితము లేక పోయినది. చివరిగా కన్న తల్లి ఒక యోగీశ్వరుని హితబోధ చేయమని కోరగా ఆయన రామలింగమును వివాహమునకు అంగీకరింపజేసెను. కన్నతల్లిని, అన్నను బాధపెట్టలేక వివాహమునకు ఆయన అంగీకరించెను.
రామలింగము, తన అక్క ఉణ్ణామలై కుమార్తె ధనకోటి ని 1850వ సంవత్సరము వివాహమాడెను. వారి తొలి రాత్రి, ఆలూ మగల ఏకాంత సమయమున రామలింగము మాణిక్య వాసగర్ వ్రాసిన ' తిరు వాసగము ' ను తన భార్య ధనకోటి కి చదివి వినిపించెను. ఆ రాత్రంతయూ ఇది కొనసాగినది. ఆ రాత్రి రామలింగమునకు దైవ పారవశ్యమైన అనుభవముగా ఉండెను.
రోజులు గడిచిన కొద్దీ, రామలింగము వ్యక్తిత్వము మరియు జీవితము పరివర్తన చెంద సాగినది. తీర్థయాత్రలు చేయ సంకల్పించిన రామలింగము, తన భార్యను పిలచి, 'తిరు వాచకము' ను తన చేతికి ఇచ్చి, తాను తీర్థయాత్రలకు వెళ్ళుచున్నానని, ఇకపై ఆమె భక్తి మార్గమును అనుసరించి, దైవ కృపకు పాత్రురాలు కావలెనని హితోపదేశము చేసి తాను బయలుదేరెను.
తన 35 వ ఏట 1858 వ సం చెన్నైను విడిచి, వివిధ పుణ్యక్షేత్రములను దర్శించిన రామలింగము, చివరిగా చిదంబర క్షేత్రమును చేరుకొనెను. చిదంబరములో స్వామివారిని చూసిన కరుంగుళికి చెందిన వెంకట రెడ్డి తన గ్రామమునకు విచ్చేయమని కోరెను. స్వామివారు అందుకు అంగీకరించిరి. వెంకట రెడ్డి స్వామి వారిని భక్తి మర్యాదలతో తన గృహమునకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను తమ నివాస స్థలమును ఏర్పరచుకొని ఉండవలసినదిగా కోరెను.
ఆయన కోరికను మన్నించిన స్వామివారు, వెంకట రెడ్డి గృహములోనే ఉండుటకు అంగీకరించెను. కరుంగుళికి 1858 వ సం వచ్చిన స్వామి వారు 1867 వ సం వరకు అక్కడే ఉండిరి. ఈ కాలములో తరచూ, చిదంబర క్షేత్రమును దర్శించుచుండెను. తిరు అరుట్పా లోని 4 వ సంపుటి మరియు 6 వ సంపుటిలోని మొదటి సగ భాగము ఈ కాలములోనే వ్రాయబడినది. ఈ కాలములోనే నటరాజుని సంపూర్ణ అనుగ్రహము స్వామి వారికి లభించినది. నటరాజానుగ్రహము అనంతరము, రామలింగ స్వామి వారు సాంఘిక దురాచారాలను నిర్మూలించుటకు కృషి చేసెను. మానవుల యొక్క సకల దుఃఖములను తొలగించుటకు ఉపాయము కనుగొనవలెనని సంకల్పించెను.
జాతి, మత, కుల, భాషా విభేదాలే మానవులకు అతి పెద్ద అడ్డుగోడలని రామలింగము గ్రహించెను. వైదిక ఆధిపత్యమును సంపూర్ణముగా ఎదిరించెను. ముఖ్యముగా చిదంబర ఆలయములో వైదీక ఆధిపత్యమును తొలగించుటకు కృషి చేసెను. ఈ సంఘటన అక్కడ ఉన్న వేద పురోహితులను ఆగ్రహావంతులను చేసినది.
చిదంబరములో అప్పుడు ఉన్న పరిస్థితులను గమనించిన రామలింగము అక్కడ తాను అనుకున్నది చేయలేనని భావించి, సర్వ మానవాళి, ఏ కుల, మత, వర్ణ భేధములు లేకుండా నటరాజ స్వామిని కొలుచుటకు ఒక ప్రత్యేకమైన ఆలయమును చిదంబర క్షేత్రమునకు సమీపములోనే నిర్మించదలచిరి. ఇదే వడలూరు నందు నిర్మించిన సత్య జ్ఞాన సభ. అప్పటి పార్వతీపురముగా పిలువబడిన వడలూరులో స్వామి వారు సత్య జ్ఞాన సభను నిర్మించి ' దానిని ఉత్తర జ్ఞాన చిదంబరము' గా ప్రసిద్ధి గావించెను.
సమరస శుద్ధ సన్మార్గ సంఘము - 1865 :
వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి, సమరస శుద్ధ సన్మార్గ సంఘము అను ఒక మార్గమును 1865 వ సం కనుగొనిరి. ఈ సంఘము యొక్క ముఖ్య ఉద్దేశము,
1. భగవంతుడు ఒక్కడే, ఆయనను సత్యమైన ప్రేమతో, జ్యోతి స్వరూపములో కొలువవలెను.
2. చిరు దేవతలను పూజింపరాదు. ఆ దేవతల పేరుతో జంతు బలులు ఇవ్వరాదు. మాంసము భుజింపరాదు.
3. జాతి, కుల, మత భేదములు ఉండరాదు. అన్ని ప్రాణులను తమ ప్రాణముగా భావించి, ఆత్మ బంధుత్వ ఐకమత్యమును కలిగి ఉండవలెను.
4. పేదవారి ఆకలి తీర్చుట మొదలైన జీవకారుణ్య ప్రక్రియయే మోక్ష గృహమునకు తాళపు చెవి.
5. పురాణ, ఇతిహాస, శాస్త్రములు సంపూర్ణ సత్యమును తెలియజేయలేవు.
6. మరణించిన వారిని సమాధి చేయవలెను. అగ్నికి ఆహుతి చేయరాదు.
ఈ సూక్తులను అనుసరించి, అందరికీ తెలియజేయుటకే సమరస శుద్ధ సన్మార్గ సంఘమును స్వామి వారు 1865 వ సం ఎర్పరిచిరి.
తిరు అరుట్పా ప్రచురణ - 1867:
1867 వ సం తిరు అరుట్పా లోని మొదటి 4 సంపుటలు (తిరు మురై) ప్రచురితమైనవి.
సత్య ధర్మశాల - (23-05-1867):
వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి భోధనలలో ముఖ్యమైనది జీవకారుణ్యము. జీవకారుణ్యమును స్వామి వారు రెండు విధములుగా విభజించిరి. అవి,
1. ప్రాణులను వధింపరాదు మరియు మాంసాహారము భుజింపరాదు.
2. ఆకలితో ఉన్నవారికి ఆహారము ఇవ్వవలెను.
స్వామివారు ఆకలిని ఒక రోగముగా అభివర్ణించెను. ఆకలి బాధ భరించలేక, మానవుడు తనకున్న అన్నింటినీ పోగొట్టుకొనగలడు. మొదట ఆకలి తీర్చిన తరువాతనే మనిషి మంచి చెడులను గూర్చి ఆలోచించును. జ్ఞానము పొందుటకు, ముందు ఆకలి నుండి విముక్తి పొంద వలెనని తలచి, గ్రామస్థులు, శిష్య మిత్ర బృందము సహకారముతో వడలూరులో ధర్మశాలను నిర్మించిరి. ఇది 1867 వ సం మే నెల 23 వ తేదీన ప్రారంభమైనది. ధర్మశాలలో స్వామివారు అప్పుడు తమ స్వహస్తములతో వెలిగించిన పొయ్యి ఇప్పటికీ వేలుగుచూనే ఉన్నది. ప్రతి రోజూ వేల మంది పేద ప్రజలకు అన్నదానము జరుగుచున్నది. ధర్మశాల స్థాపనానంతరము, స్వామివారు 1870 వ సం వరకు అక్కడే నివశించిరి.
సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) - 1870:
ధర్మశాలలో ఉన్న స్వామివారు, అక్కడ రద్దీ పెరుగుటచే, ఏకాంతము కోరి, వడలూరునకు సమీపములో 5 కి. మీ. దూరములో ఉన్న మేట్టుకుప్పము అను ఒక కుగ్రామమునకు వెళ్ళి అక్కడే బస చేయుచుంటిరి.
మేట్టుకుప్పములో స్వామివారు నివశించిన ఆ భవనము సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) అని పిలువబడుచున్నది. ఈ పేరు స్వయముగా స్వామివారే ఆ భవనమునకు పెట్టిరి. సిద్ధిని ప్రసాదించు స్థలము అని దీని అర్థము.
1870 వ సం నుండి 1874 వ సం లో స్వామివారు సిద్ధి పొందుట వరకు ఎక్కువ సమయము ఇక్కడే గడిపిరి. సిద్ధి పొందినది కూడా ఇక్కడే.
సత్య జ్ఞాన సభ - (25-01-1872):
భగవంతుడిని అరుట్పెరుం జ్యోతి (దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి) స్వరూపములో దర్శించిన స్వామివారు, ఆ దివ్య అఖండ జ్యోతిని ఆరాధించుటకు వడలూరులో సత్య జ్ఞాన సభను ఏర్పరచిరి. 1871 వ సం సత్య జ్ఞాన సభను నిర్మించుటకు ప్రారంభించిరి.
1872 వ సం జనవరి 25 వ తేదీన, గురువారము, పుష్యమి నక్షత్రమున మొదటి సారి సభలో ఆరాధనలు మొదలైనవి. ప్రజలందరూ దివ్య అఖండ జ్యోతిని దర్శించుకొని, ఆనంద పారవశ్యులైరి. సత్య జ్ఞాన సభ ప్రకృతి వివరణ అని స్వామి వారు చెప్పుచుండిరి.
ఆంతరంగికములో చూడవలసిన అనుభవములనే బాహ్యములో సత్య జ్ఞాన సభలో భావనా రూపములో చూపబడినది. మనలోని అరుట్పెరుం జ్యోతి మాయా తెరలచే కప్పబడియున్నది. వాటిలో ప్రధానమైనవి వేరు వేరు వర్ణములలో ఉన్న 7 తెరలు. మనలో ఉన్న అజ్ఞానమను ఈ తెరలు తొలగినపుడు, అరుట్పెరుం జ్యోతిని దర్శించగలము. ఇదే దీని సారాంశము. ఆంతరంగికమున తాము పొందిన అరుట్పెరుం జ్యోతి అనుభవమును, బాహ్యములో సభ రూపములో స్వామి వారు నిర్మించిరి.
సన్మార్గ జెండా - (22-10-1873):
వాళ్లలార్ తమ మార్గమునకు ఒక ప్రత్యేకమైన జెండాను కనుగొంటిరి. ఈ జెండాకు సన్మార్గ కొడి (సన్మార్గ జెండా) అను పేరు కలదు. పసుపు, తెలుపు రంగులలో ఉన్న ఈ జెండాను, మేట్టుకుప్పము, సిద్ధి వళాగ ప్రాంగణములో, 1873 వ సం అక్టోబర్ 22 వ తేదీన మంగళవారము, ఉదయము 8 గంటలకు మొట్టమొదటి సారిగా, జెండాను కట్టి ఆవిష్కరించిరి. ఆ తరువాత ఒక గొప్ప ఉపన్యాసము చేసి అనుగ్రహించిరి. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి సంపూర్ణ సిద్దాంతములను పొందుపరచిన ఆ ఉపదేశము మహోపదేశము - పేరుపదేశము అని చెప్పబడుచున్నది.
మరణము లేని మహర్జీవితము - రామలింగ స్వామి వారి అదృశ్యము (30-01-1874):
శుద్ధ సన్మార్గము యొక్క అంతిమ లక్ష్యము మరణమును జయించుటయే. మరణమును జయించిన వాడే సన్మార్గి అనునది స్వామి వారి ఉపదేశము.
"என் மார்க்கம் இறப்பொழிக்கும் சன்மார்க்கம் தானே"
"నా మార్గము, మరణమును నిర్మూలించు సన్మార్గమే కదా"
అనునది స్వామి వారి వాక్కు. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు శుద్ధ దేహము, ప్రణవ దేహము, జ్ఞాన దేహము అను త్రిదేహ సిద్ధిని పొందిరి. దేహ సిద్ధి పొందిన వారి శరీరము సమాధి కాజాలదు. వారి భౌతిక శరీరము కాంతి స్వరూపముగా మారును. నిత్య దేహము పొందెదరు.
అట్టి నిత్య దేహమును పొందిన శ్రీ జ్యోతి రామలింగ స్వామి, 1874 వ సం జనవరి నెల 30 వ తేదీన శుక్రవారము పుష్యమి నక్షత్రమున అర్థరాత్రి 12 గంటల సమయమున సిద్ధి వళాగమున తమ గది లోనికి ప్రవేశించి అదృశ్యమైరి.
" அருட்சோதி ஆனேன்என்று அறையப்பா முரசு
அருளாட்சி பெற்றேன்என்று அறையப்பா முரசு
மருட்சார்பு தீர்ந்தேன்என்று அறையப்பா முரசு
மரணந்த விர்ந்தேன்என்று அறையப்பா முரசு. "
అనగా,
" అనుగ్రహ అఖండ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) అయ్యాను నేను
అనుగ్రహ పాలన పొందాను నేను
అజ్ఞానమను అంధకారమును నిర్మూలించితిని నేను
మరణమును జయించాను నేను "
" காற்றாலே, புவியாலே, ககனமதனாலே,
கனலாலே, புனலாலே, கதிராதியாலே,
கூற்றாலே, பிணியாலே, கொலைக் கருவியாலே,
கோளாலே, பிறவியற்றுங் கொடுஞ்செயல்களாலே,
வேற்றாலே, எஞ்ஞான்றும் அழியாத விளங்கும்
மெய்யளிக்க வேண்டும் என்றேன் விரைந்தளித்தான் எனக்கே "
అనగా,
" గాలి వలన గానీ, భూమి వలన గానీ, గగనము వలన గానీ,
అగ్ని వలన గానీ, నీరు వలన గానీ, సూర్యుడు మొదలైన వాటి వలన గానీ,
మరణము వలన గానీ, రోగము వలన గానీ, మారణాయుధముల వలన గానీ,
గ్రహ ఫలముల వలన కలుగు చెడు వలన గానీ,
మరి వేరొక విధమునైననూ, ఎన్నడునూ నశింపక శాశ్వతముగా ఉండు
శరీరమును అనుగ్రహించమని కోరితిని, తక్షణము దానిని నాకే అనుగ్రహించెను.
ఓ జనులారా! దీనిని అల్పమనుకొన వద్దు. నా అరుట్పెరుం జ్యోతి యందు శరణు పొందుము. "