వళ్ళలార్ అని ప్రముఖముగా అందరిచే పిలువబడే శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు పొందిన ఆధ్యాత్మిక అనుభవములు, వాటి లోతులను పరిగణించినచో వారు 19 వ శతాభ్థపు యోగులు, ఋషులందరిలో ప్రాముఖ్యులు మరియు వారు తమ అంతరాంతరము, అంతరము, బాహ్యాంతరము మరియు బాహ్యములలో దైవత్వాన్ని అనుభవించి తెలుసుకొన్నారు.
వళ్ళలార్, అరుట్పెరుం జ్యోతి అను దయామయ అఖండ జ్యోతి యొక్క కృపచే తాము పొందిన అమరత్వమును (మరణమును జయించడం) స్పష్ట్టముగా పునరుద్ఘాటించిరి.
దైవత్వమును పొందుటకు మరణమును జయించి నిత్య ఆనంద జీవితము పొందుట అవశ్యమని ప్రజలకు ప్రభొధించిరి. తన ఆత్మ అంతయూ అంతులేని ప్రేమ, కారుణ్యములతో నిండిన ఒక మహా పురుషుడు. దైవ జ్ఞానము మరియు మరనరహిత భౌతిక దేహమును పొందగలిగే విజ్ఞానమును పొందిన సత్య చైతన్య మూర్తి. మరణమును జయించి, ముద్ధేహ సిద్ధిని పొంది, పంచకృత్యములనబడే సృష్టి, స్థితి, నాశనము, అదృశ్యము మరియు అనుగ్రహములను తానే స్వయముగా చేయగల శక్తిని పొందిరి. దీనిని ఆయనే స్వయముగా తాము వ్రాసిన " అగవల్ " అను గ్రంథములో వ్రాసి ఉన్నారు.
" ఉలగుయిర్ తిరళ్ ఎలాం ఒళినెరి పెట్రిడ ఇలగుం ఐంతొయిలయుం యాన్ సెయ తందనై "
అనగా,
" ప్రపంచమున ఉన్న సకల ప్రాణులు దివ్య వెలుగుని పొందుటకు పంచకృత్యములను నేను చేయునట్టు చేసితివి "
వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు రచించిన " తిరు అరుట్పా " అను పద్య రచన 6 భాగములు కలిగి ఉన్నది. వాటిలోని 6 వ భాగము ఆధ్యాత్మిక చరిత్రలోనంతటికీ అసమానమైనది. సత్య జ్ఞానా లోకము దానిని మించిన జ్ఞాన అనుభవములు, దేహము యొక్క పరివర్తన మరియు భౌతిక అమరత్వమును గురించి ఆయన వివరించి ఉన్నారు.
ఇది కాక, ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన ఒక విమర్శకుడు, రచయిత, ప్రచురణ కర్త, వ్యాఖ్యాత మరియు ముఖ్యముగా మూలికలు మరియూ ఆకుల పోషక మరియు వైద్య విలువలు, రహస్యాలు, రసవాదం, జ్యోతిష్య శాస్త్రం మరియు వైద్యములో అపార జ్ఞానము కలిగి ఉంటిరి. ఆయన ఒక గొప్ప సంగీతకారుడు. ఆయన ఆధ్యాత్మిక అనుభవములను, సత్య జ్ఞానమును పాటల రూపములో రచించి, ఆయనే స్వయముగా స్వరపరచి అందరికీ సులభతరముగా వివరించి ఉన్నారు. ఇలా అన్ని కళలయందు ఎటువంటి విద్యాభ్యాసము లేకనే ప్రావీణ్యత పొందినది ఆయనకు కలిగిన దైవానుగ్రహము వలనే. ప్రపంచములోకెల్ల ఉన్నత జ్ఞానమగు అమరత్వమును పొందిన జ్ఞాన మూర్తి వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి.