Thursday, October 29, 2015

సమరస శుద్ధ సన్మార్గము

సమరస శుద్ధ సన్మార్గ సంఘము, ఒక సార్వత్రిక పరిణామాత్మక ఆధ్యాత్మిక ఉద్యమము. ఇది వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారిచే 1867 వ సంవత్సరం ప్రారంభించబడినది.

ఇది సత్యము,  స్వచ్ఛత, ధర్మము మరియు సామరస్యముల సమాహారము. ఇది అఖండ దివ్య అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) యొక్క మార్గము మరియు ఈ భూమి పైనే మానవుడు పరిణామ మరణరహిత దివ్య భౌతిక దేహమును పొందుటకు పురోగమించే పరిణామ విజ్ఞానము.

అన్ని మతములు మరియు తత్వముల అంత్యమున శుద్ధ సన్మార్గము యొక్క ప్రారంభము

రామలింగ స్వామి తన ఉన్నత ఆధ్యాత్మిక మార్గమును, సమరస శుద్ధ సన్మార్గము అని అభివర్ణించెను.
సమరసము అనగా, అన్ని మతములు మరియు తత్వములు, ఆధ్యాత్మిక విభాగములన్నింటి చివరి లక్ష్యములను, తన ప్రారంభముగా (పూర్వముగా) చేసుకొని, క్రమబద్ధీకరించిన ఉన్నత అనుభవమగు గురు తురియమునకు (శుద్ధ సన్మార్గము యొక్క ప్రథమ అనుభవము) దారి తీయును. చైతన్యము (కాన్షియస్ నెస్) యొక్క క్రమము నుండి, శుద్ధ సన్మార్గము దైవత్వము యొక్క అంతిమ దశకు దారి చూపు అత్యున్నత మార్గము. శుద్ధ సన్మార్గము మత, తత్వ సన్మార్గమును (అతీంద్రియ మరియు తత్వ జ్ఞానములు) మరియు శివ సన్మార్గమును (షడాంతములు అనగా వేదాంతము, యోగాంతము, సిద్ధాంతము, భోదాంతము, నాదాంతము, కలాంతము) తనలో కలిగి, దానిని మించి ఉన్నది.

శుద్ధ సన్మార్గము అన్ని మత, తత్వ, షడాంత సన్మార్గములను తనలో కలిగి, వాటిని, వాటి గుణ, నిర్గుణ లక్ష్యములను మించి ఉన్నది. 

మత/సమయ సన్మార్గము: భగవంతుడిని నామ, రూప, గుణములతో కొలిచి, ఆచరించి, అనుభవమును పొందుట.

సన్మార్గము అనేక రకములుగా విభజింపబడియున్నది. మత సన్మార్గము యొక్క ముఖ్య లక్ష్యము, భగవంతుడిని నామ, రూప, గుణములతో కొలిచి, ఆచరించి అనుభవమును పొందుట (గుణ లక్ష్య అనుష్ఠానము).

ఈ మత సన్మార్గము సత్చిదానందము లోని కొంత భాగమును మరియు లక్షణములను బట్టి దాని యొక్క స్వచ్చతను కలిగి ఉంటుంది.

సత్ భోదము (సత్య జ్ఞానము), సత్ కర్మ, సత్ సంఘము, సత్ కాలము, సత్ విచారము, సత్ పాత్ర, సత్ జనము, సత్ ప్రవర్తన మొదలైనవి సత్యమునకు సంభందించి ఉన్నది. దీని స్వభావము అహింస, ఓర్పు, శాంతి, స్వీయ - నియంత్రణ, ఇంద్రియములపై ఆధిపత్యము మరియు ఆత్మ యొక్క ప్రకృతి సహజమైన లక్షణమగు తోటి ప్రాణులయందు కలుగు దయ. దీని ప్రాముఖ్యమును అర్థం చేసుకోవడము ద్వారా, సాధనతో సత్యమును తెలుసుకొను ఆ స్థితియే మత సన్మార్గము లేక సమయ సన్మార్గము అగును.

తత్వ సన్మార్గము: భగవంతుడిని నామ రూపములు లేక నిర్గుణముగా కొలిచి, ఆచరించి అనుభవమును పొందుట.

తత్వము మతమును మించినది. దీని ముఖ్యమైన ప్రయోజనము దైవమును నిర్గుణ లక్ష్యముతో అన్వేషించుట. మహా వాక్యములగు సోహం, శివోహం, తత్వమసి, శివత్వమసి మొదలగులను వాచ్యానుభవములుగా పొంది, ఆ తరువాత వాటి లక్ష్య అనుభవమును పొందుటయే దీని ఉన్నత లక్ష్యము.

సమరస శుద్ధ సన్మార్గము: ఇది ఉత్తమ దివ్య శిఖరమగు గొప్ప మార్గము.

శుద్ధము అనగా ఏకత్వమును మించిన స్వచ్ఛత యొక్క శ్రేష్ఠమైన స్థితి.

ఇక్కడ సన్మార్గమునకు ముందు సమరస శుద్ధ అను పదములు వచ్చుట వలన, ఇది అన్నింటినీ సామరస్యముగా తనలో కలుపుకొని తననుండి స్వచ్ఛతను భహిష్కృత పరచి, పైన చెప్పబడియున్న మతము, తత్వము మరియు షడాంతములను మించియున్నది. దీని యొక్క ఉన్నత లక్ష్యము ఎవరైతే శుద్ధ సన్మార్గము యొక్క ఉత్తమ దివ్య శిఖరమగు శుద్ధ శివ తురియాతీతమను అనుభవమును (17 వ అంతిమ అనుభవ దశ) పొందేదరో, వారే పరిపూర్ణత చెందినవారగురు.

శుద్ధ సన్మార్గ సాధన:

1. ప్రాథమిక సాధన: - పరోపకారము మరియు సత్విచారము 

పరోపకారము - సర్వ జీవులకు చేయు సేవ, జీవకారుణ్యము [జీవులయందు కారుణ్యము, దైవము యందు ప్రేమ, భక్తీ కలిగి ఉండ వలెను]

సత్విచారము - స్వీయ/ఆత్మ పరిశోధన

పరోపకారము: అన్ని జీవులు పరమాత్మ నివశించు ఆలయములు. ఆ పరమాత్ముని, అన్ని జీవులయందు దర్శించి, వారికి చేయు సేవయే పరొపకారము. సకల జీవులను కారుణ్యముతో సేవించుటయే  జీవ కారుణ్యము.

' జీవకారుణ్యమే మోక్ష గృహమునకు తాళపు చెవి ' - వాళ్ళలార్

- సంపద, ఇంద్రియములు, బుద్ధి మరియు దేహము మొదలైన అన్నింటినీ పరికరములుగా చేసుకొని సకల ప్రాణులను సేవించుటయే జీవకారుణ్యము.
- సాయము చేయలేని పరిస్థితులలో కనీసము వారి బాధను తొలగించమని స్వచ్ఛమైన మనస్సుతో ఆ భగవంతుడిని ప్రార్థించవలెను.

సత్విచారము: మన యొక్క చిన్నతనమును అనగా అల్పమగు మన స్థితిని గురించి విశ్లేషించుకొని, మనలోని అహంకారమును తొలగించుకొనవలెను.

మానవ సహజమును గూర్చి ఆత్మ పరిశోధన చేసుకొనుటయే సత్విచారము. మన అల్ప స్థితిని, దైవము యొక్క ఉన్నత స్థితిని పోల్చి స్వీయ పరిశోధన చేసుకొనవలెను. దైవము యొక్క అద్వితీయమైన లక్షణములను గూర్చి విచారించి, ఆ దైవము యందు మన కష్ఠములను మరియు లోపములను విన్నవించి, వాటిని తొలగించమని ప్రార్థించవలెను.

2. ముఖ్య సాధన:

అభిలాష, ధ్యానము మరియు అర్పణలలోనే ఒకరికి నిజమైన ఆధ్యాత్మిక పురోగతి లేక పరిణామక్రమము లభించును. దీనిని సాధించుటకు వాళ్ళలార్ మనకు 4 రకములైన క్రమశిక్షణలను బోధించిరి.

అవి,

1. ఇంద్రియ క్రమశిక్షణ
2. కరణ క్రమశిక్షణ

3. ఉన్నత సాధన

3. జీవ క్రమశిక్షణ
4. ఆత్మ క్రమశిక్షణ

4. శుద్ధ సన్మార్గ పరిపూర్ణత:

దైవానుగ్రహము లేనిచో ఏ విధమైన పరిపూర్ణత సాధ్యము కదు.
శుద్ధ సన్మార్గ పరిపూర్ణత 3 దశలలో జరుగును.
అవి,

1. చిత్ సభ అనుభవము (ఆజ్ఞ స్థానమునందు, భృమధ్యమున ఆత్మానుభవమును పొందుట)
2. ఫొర్ సభ అనుభవము (స్వర్ణ సభ)
3. శుద్ధ జ్ఞాన సభ అనుభవము

మరణమును జయించి నిత్య జీవితమును పొందుట అనునది ఉన్నత దశ. ఇది శుద్ధ సన్మార్గము యొక్క శిఖరము. మరణ రహిత దేహమును పొంది, నిత్య జీవనము పొందుటయే, శుద్ధ సన్మార్గము యొక్క పరిపూర్ణత, మరియు మహా జ్ఞాన సిద్ధి. ఇది శుద్ధ జ్ఞాన సభ అనుభవమును పొందిన తరువాత కలుగు అనుభవము.

భౌతిక దేహమును మరణము లేని దేహముగా మార్చుట, అంతరాత్మను పరిశుద్ధపరచి, అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం  జ్యోతి) అనుభవమును పొందినపుడే సాధ్యమగును.

మరణమును జయించుట

ఇది శుద్ధ, ప్రణవ, జ్ఞాన దేహముల సమగ్ర పరిపూర్ణ పరివర్తన. దీనికి మరణము కానీ, విద్వంసము కానీ ఉండదు. దీనికి కాలము, ప్రదేశము మరియు పరిస్థితుల పరిమితులు ఉండవు.
ప్రపంచములోని జీవకోటి మరియు వస్తువులన్నింటి ఉనికిని, తన వ్యక్తిగత మరియు సార్వత్రిక సూత్రములతో, తన సంకల్ప స్వేచ్ఛతో నిర్వహించు ప్రావీణ్యత పొందును.

శుద్ధ సన్మార్గము యొక్క సత్య అనుచరులు

ఎవరైతే ఈ క్రింద ఇవ్వబడిన సూత్రములను పాటించెదరో వారే శుద్ధ సన్మార్గము యొక్క సత్య అనుచరులు కాగలరు.
  • శుద్ధ సన్మార్గమునకు ముఖ్య ప్రతిబంధకములైన మార్గములగు కుల, మతములు మరియు తత్త్వములను విడిచిపెట్టు వారు. 
  • తమ అంతర్ జ్ఞానముతో ఆగ్రహము, సంభోగము మొదలైనవాటిని తిరస్కరించి తమను తాము రక్షించుకొనువారు.
  • హత్య, జీవ హింస మరియూ మాంసాహారములనుండి దూరముగా ఉండువారు. 
వీరు అనారోగ్యము, వృద్ధాప్యము, దుఃఖము/బాధ మరియు మరణము నుండి తమను తాము రక్షించుకొనెదరు. వారు వారి యొక్క సరియైన ప్రయత్నము మరియు క్రమశిక్షణ ద్వారా ప్రకృతి యొక్క అసాధారణ లక్షణములు అనగా, ప్రమాదములు, విధి వలన కలుగు ఆకస్మిక పరిణామముల నుండి మరణమును నివారించి తమను తాము రక్షించుకొనగలరు. 
భౌతిక శరీరము మరణ రహిత దివ్య కాంతి స్వరూపముగా పరివర్తన చెందుటకు ముందు స్వీయ పరిపూర్ణత, అంతర్ స్వచ్చత మరియు దివ్య అఖండ అనుగ్రహ జ్యోతిని (అరుట్పెరుం జ్యోతి) అవగతము చేసుకొనుట ముఖ్యము. 

శుద్ధ సన్మార్గము - సత్యమునకు ప్రత్యక్ష మరియు స్పష్ఠ మైన మార్గము. 

సాంప్రదాయ గ్రంధములు, మతములు మరియు తత్వములు పాక్షిక పరిపూర్ణతను మాత్రమే ఇవ్వగలదు. సంపూర్ణ పరిపూర్ణత ఇవ్వలేదు. 

శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు, సాంప్రదాయ గ్రంథములు, మతములు మరియు తత్వములు అనుసరించుటకు సరియైన మార్గదర్శకాలు కావని కనుగొనిరి. దానికి కారణము వాటిని నిర్మించిన వారి మానసిక స్థితి, ప్రాతినిధ్యము, వారి ఆధ్యాత్మిక స్థితి మరియు గుర్తులు, ఆయా దేవతలు మరియు మూర్తులను, వారికి సంబంధించిన మంత్రములను, నియమములను అనుసరించి చేయబడినవి. 

అవి పాక్షిక పరిష్కారమునకు దారి తీయును కానీ, పూర్తి సమగ్ర పరిపూర్ణత, సమరస శుద్ధ సన్మార్గమే ఇవ్వగలదు. ఇది శుద్ధ శివ తురియాతీత యోగము. 

ఈ పరిశీలన ద్వారా స్వామి వారి శిష్యుల మనస్సులో ఒక గందరగోళం సృష్ఠించబడినదని తెలుస్తున్నది. స్వామి దానిని ఒక ఆచరణాత్మక మార్గము ద్వారా పరిష్కరించెను. స్వామి వారు తమ శిష్యులను మతము మరియు తత్వములలో వారి సమయమును, శక్తిని వృధా చేయక, శుద్ధ సన్మార్గమను ఈ మార్గమును అనుసరించమనెను. 

మరణ రహిత దేహమును పొందుటలో దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) మంత్రము యొక్క శక్తి:

శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు తమకు ఆ దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) స్వయముగా ప్రసాదించిన ఈ మంత్రమును తమ శిష్యులకు అనుగ్రహించెను. దివ్య అఖండ జ్యోతి తాను స్వయముగా ప్రభావంతమై మరియు దాని పర్యవసానంగా 22-10-1873 న శుద్ధ సన్మార్గ ప్రారంభమునకు గుర్తుగా ఈ మంత్రమును బహిర్గతపరిచెను.

                                   అరుట్పెరుం జ్యోతి          అరుట్పెరుం జ్యోతి
                                   తనిప్పెరుం కరుణై          అరుట్పెరుం జ్యోతి

అనగా,

                దయామయ దివ్య అఖండ జ్యోతి        దయామయ దివ్య అఖండ జ్యోతి
                అసమాన కరుణా సాగరం                   దయామయ దివ్య అఖండ జ్యోతి 

 అఖండ జ్యోతి యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణమైన ఈ మంత్రము, సాధన మార్గమునకు దోహద పడును. అందువలన ఈ మంత్రము, శిష్యులకు సమిష్ఠిగా అఖండ జ్యోతి యొక్క అనుగ్రహ వరముగా ఇవ్వబడినది. ఇది మనము సత్యమును తెలుసుకొని, మరణ రహిత దివ్య దేహమును పొందుటకు దారి చూపును.













No comments:

Post a Comment