Friday, May 20, 2022

సుబ్రమణ్యం

 సుభ్రమణ్యం అనగా నేమి?  మన భృకుటి మధ్యమున ఆరుముఖములు గలిగి పరిభ్రమించుచున్న ఒక మణి ప్రకాశమును పొంది యున్నది. ఈ జ్యోతి మణినే షణ్ముఖ మణి అని పెద్దలు పేర్కొనిరి. మన మూలాధార చక్రమునకు  పైన మూడు స్థానములు విడిచి విశుద్ధమయిన హృదయస్థానమంధలి ఎడమ భాగమున ఆరు తలలను కలిగిన ఒక నాడి వున్నది. దీనినే సుభ్రమణ్యం అని చెప్పుదురు. ఈ దేహమునందలి ఆరు జ్ణానముల కలయిక అయిన శుద్ద వివేకము అనబడు జ్ణానమును కూడా షణ్ముఖమ్ అని అందురు. ఆరు ఆధారములలోని ఆరు ప్రకాశములను షణ్ముఖం అందురు . ఏది ఏమైనప్పటికి సర్వతత్వముల అంతములోశాంతితో నిండిన ఆరు తలలు గల శుద్ద ఆత్మ జ్ణాణముతో నిండిన చిత్తమే సుభ్రమణ్యం . ఆరు జ్యోతులను కలిగి ,ఆరు జ్ణానములతో ఆరు తలలు కలిగి ఉండటము వలన ముఖములు ఆరు ,పాదములు రెండుగా అనగా ఉద్బ వించు జ్ణానము (మానసిక జ్ఞానము)  మరియు ఉద్బవింపచేయు జ్ఞానము(ఆత్మజ్ఞానము) అనగ విషయ జ్ఞానము మరియు నిర్విషయ జ్ఞానము . చేతులు పన్నెండు  ఆరు ఆధారములలోని ప్రకాశ అప్రకాశ స్థితి. 

పది ఆయుధము , అభయ వరదం అనునవి

1.వజ్రం- తీక్ష్ణ భావము,

2 శూలం- శక్తిని ,జ్ఞానమును,అనుగ్రహమును,

3 మణి- ఆత్మ స్వరూపమయిన నాధమును , 

4 ధ్వజం- కీర్తి ని ,

5 సరసిజం- దయను,

6 కుక్కుటం- మత్సర్యములేని పూర్ణత్వమును ,

7 పరాగమ్- బంధవిముక్తిని,

8 దండం- వైరాగ్యమును ,

9 బాణం- ఆప్యాయతను,

10 అభయం- క్షమాగుణమును,

11 వరధం- సహనమును,

12 కధాంబమాల- సర్వతత్వ ఖండ నమును,

            పలువర్ణములను కలిగి ఉన్నది, విచిత్ర రూపము కలిగి ఉన్నది, మతిమరుపులంటి గుణములకు కారణమైనది, మాయకు స్థానమై ఉన్న మూల ప్రకృతియే మయూరమ్ .మయూర వాహనము పై స్వామి అధిరోహించియుండుట అనునది ఏమనగా : పిండాణ్డ స్వరూపమైన ఈ  దేహము నందు మరియు అండమునందు మూల జ్ఞాన కారణమైన ప్రకృతి మాయా యొక్క అశుద్ద కేవలమయిన అశుద్దా శుద్ద మహా అహంకారము అనే రాక్షస అంశమైన  శూరతత్వమును, అందులోనుండి వెలువడిన మూడు రకములైన తత్వములతో అజ్ఞాన మార్గములో లో ఆత్మజ్ఞానమును, పిండ ప్రతిరూపములైన దేవతలను, విషయ ప్రతిరూపములైన ఇంద్రియములను, నాడి ప్రతిరూపములైన యంత్రములను,ప్రాణప్రతిరూపములైన జీవులను హరించి స్వ పరిపాలన చేయును.అట్టి శూర తత్వమును అంతమొందించునపుడు పైన చెప్పబడిన తత్వము మహామాయ అయిన మామిడి వృక్షమై మాత్సర్యమునకు ప్రతిరూపమయిన కుక్కుటముగాను విచిత్ర మాయ అయిన నెమలిగాను,మహా మదము గల గజముకఖుడుగాను అతిక్రోధమైన సింహముఖముగాను ప్రతిబింబించును.

సర్వతత్వములను తన వశము చేసుకొని అహంకారము అనే ధ్వజమును ఎగురవేసి అజ్ఞాన నాటక మాడే తత్వ అహంకారమును అణచి పతి పశు పాశం అనాది నిత్యం అనే సిద్ధాంతమును  విశదీకరించి చూపుటకు  మాత్సర్య కుక్కుటమును బోదమను చేతితో అణచి విచిత్ర మాయ అయిన నెమలిని తన కాళ్ళ క్రింధ వుంచి తాను పైన అధిరోహించి దాని గర్వమును అణచి జుగుప్సాకర మాయాతత్వములను సంహరించి శుద్ద విషయ భువనమైన దేవ లోకమును  నిలకడగా వుండునట్లు చేసి ,ఇంధ్రుని కుమార్తె అయిన తాంత్ర తత్వమనే దేవాయనై అమ్మవారిని తన ఎడమ వైపు వుంచి ఇంద్రియములయిన  వేటగాళ్లచే పెంచ బడిన మానసము అనే లేడి గర్భమున జన్మించిన వల్లి అనే పరిశుద్ద మనసుగల అమ్మవారిని తన కుడి భాగమున వుంచి , నవ తత్వ కారణమైన నవ వైరాగ్య తత్వమైన  వీరులను సమీపమున  వుంచి ,సకల జీవరాసులకు స్మృతి మరియు స్మృతిబ్రంసమునకు మధ్య వివేకా రూపమైనట్టియూ,పాదము నుండి నాభి వరకు ఉష్ణరూపమై ,నాభి నుండి కంఠము వరకు ఆధార నాడీ రూపమై, కంఠము నుండి భృకుటిమధ్యము వరకు మణిరూపమై,శిరస్సునంధు కాంతిరూపమై ,బుద్ధి యంధు పరిశుద్ధ జ్ఞానమై అనుభవములో నిత్యమై,సర్వము సంపూర్ణమై,కోణములు ఆరై ,ఏ కాలములోను మతములు ఆరై, స్వరవేదాంత సిద్దాంతములలో ఆరుగాను,వర్ణములలో ఆరుగాను,వెలయు నిజమైన దేవుడే సుబ్రమణ్యం .

ఏక  ముఖం ,ద్వి ముఖం ,త్రిముఖం, చతుర్ ముఖం ,షణ్ముఖం  అని  వెలయుటకు గల కారణము ఏమి 

ఏకముఖం:   అసమానమైన  పరబ్రమ్హ స్వరూపము జీవులకు అనుగ్రహించు నిమిత్తమై మన భావమునకు ఏకమై పరమాకాశమునంధలీ జ్ఞాన స్వరూపముగా ఎంచి ఏక ముఖముతో పూజింపబడుచున్నాడు అని జ్ఞానులు  పేర్కొనేధరు.

మూడు ముఖములు శుద్ధ సాత్వికం ,శుద్ద రాజసం,మరియు శుద్ద తామసం  ను సూచించును.

నాల్గు ముఖములు  అనగా  పశు మనస్సు అనగా జీవం యొక్క మనస్సును,శుద్ద మనస్సును,అంతఃర్ముఖము ,సంకలిత మనస్సు అయిన  బుద్ధి,చిత్తము,మరియు అహంకారము అను తత్వముల యొక్క కలయిక.

ఆరు ముఖములు  పంచేన్ద్రియ జ్ఞానము మరియు ఆత్మ జ్ఞానమును  అను తత్వముల యొక్క కలయికయొక్క  మూలకారణమైన ప్రకాశమే ఆరుముగమ్.

మయూరము తన పాధము క్రింధను,నోటియంధును సర్పము దేనిని సూచిస్తుంధి ?.విచిత్ర మాయా రూపమయిన అంధకార రూపమయిన  అహంకారము పుట్టి విశ్వమంతా వ్యాపించు తరుణము ములాంకురమయినటువంటి మూలప్రకృతి స్వరూపమయిన పరమాత్మనుండి వెలువడి వ్యాపించు ప్రాణవాయువు యొక్క వేగమును ఆటంక పరచు విధముగా  పై ప్రకృతి  మాయ అను అహంకార ద్వారమైన నెమలి నోటి ద్వారా ప్రకృతి ప్రాణ వాయువు యొక్కఉచ్వాస నిశ్వాసల యొక్క  వేగమును  తగ్గించుచున్నది. (మాయా రూపముగా నెమలిని, అహంకార ద్వారముగ నెమలి యొక్క  ముఖమును ,నెమలి  ముఖమునందు గల సర్పము పిండము నందలి   ప్రాణ వాయువు యొక్క ఉచ్వాస నిశ్వాసలను సూచించు విధముగా వర్ణించబడి ఉన్నది. .నెమలి నోటియందుగల సర్పము పిండము యొక్క  ప్రాణ వాయువు యొక్క ఉచ్వాస నిశ్వాసలను సూచించునదిగా వున్నది) 

పడైవీడు అనగానేమీ ?స్వామి కొలువైవున్న స్థలములు అవి  ఆరుపడై అని చెప్పబడి వున్నది.ఆ ముఖ్యమైన ఆరు స్థలములు .

1.తిరువేరగం(స్వామి మాలై ) : అందమైన మరియు జ్ఞానముతోకూడిన స్థలము.

2. తీరు ఆవినన్కుడి (పళని):  ‘తీరు’ అనగా లక్షీకరమైన సంతోషము, ‘ఆ’ అనిన పశు అనబడు జీవుడు ‘ఇనన్’ అనగ సూర్యుడు అనబడు బుద్ధి .ఈ మూడు కలిసియున్న ప్రదేశము అనగా ఆత్మ జ్ఞానము యొక్క శుద్ధ కార్య స్థలము.

3. ఫల ముధీర్ సోలై (అలగర్ మలై):  ఇన్ద్రియములు , అంతఃకరణములు ,  ఆత్మ  మొదలగు వాటి అనుభవ ఫలమైన సంతోషమునుండి  విముక్తి చెంది నిర్మలమైన జ్నానమును ప్రసాదించు స్థలము.

4. తిరుచ్చీరలైవాయ్ (తిరుచ్చెంధూర్ ,జయంతిపురం): పరిశుద్దమైన  మనస్సు యొక్క ముఖద్వారము ప్రాపంచిక విషయ సాగరమునంధు కోరిక అనే అలలు ఎగసిపడే స్థలమైన సముధ్ర తీరము వలే, అలజడితో వుండునటువంటి మానవుల హృధయ స్థానమైన మనస్సు అజ్ఞా నమనే అసురుడిని నివర్తించి సంతోషమును పొంధి పది మనస్సు అనగా పరమాత్మగా వెలసిన స్థలము.

5 తిరుప్పారకున్ద్రమ్ : చలనములేని ఒక అంశము యొక్క పరమార్థమై వున్న వివేకా వుల్లాస  సంతోషములతో పరిపూర్ణముగా నిండివున్న స్థలము కుండృ అనగా కొండ.

6.కుండృతోరాడల్ (తిరుత్తణి) : పర్వతములే నిలయమై వున్నవాడు.

శిఖరము అనునది నిశ్చలమైన స్థితికి మొదటి కారణమైన తుర్యము అను స్థితి ఈ తుర్యము పరతుర్యము శుద్ధతుర్యము,గురుతుర్యము,శివతుర్యము,శక్తి తుర్యము, మొదలగు తుర్య శిఖరములు అనుభవములో అనంతముగా వుండును.

పైన పేర్కొన్న అనుభవములు దేహమునందు స్థానములు ఏవి అనగా జనానాంగములు,నాభికి క్రింధి భాగము,నాభి,నాభికి పై భాగము,ఉరస్సునంధు రొమ్ముభాగమునకు క్రింధి భాగము,రొమ్ము ప్రదేశము మోదలగునవి.

బ్రహ్మను చెరయంధు బంధించినది : శుద్ధ మనో సంకల్ప సృష్టి గావించు బ్రహ్మము అనే మనస్సును క్రియ యంధు ప్రవేశించకుండా చేయడానికి శుద్ద ప్రకాశ వివేకముతో నిండియున్న సుబ్రమణ్య తత్వముతో సర్వపిండ విషయములైన సృష్టి ,స్థితి ,లయము,తిరోదానము, అనుగ్రహము మొదలగు పంచకృత్యములు వివేకముతో తన ఆద్వర్యములో చేయటానికి ఎట్టి అలసత్వము లేక బంధించి వుంచుటయే చెరసాలయంధు వుంచినదాని అర్థము.

ఈశ్వరునికి ఉపదేశించినది ఏమి అనగా ? రుధ్రతత్వమైన ప్రేరక స్థితి అయిన కారణ తత్వము యొక్క అంతమైన ఈశ్వరతత్వము యొక్క సహజ జ్ఞానము ప్రకోపించి క్రియాశక్తి తగ్గటం వలన ,క్రియా కారణ భూతమై, జ్ఞాన కారణ అంశమై వెలసిన ప్రణవమైన సత్యముతో నిండి వున్న క్రియాహీన నిర్విష య అనుభవము ఈశ్వర తత్వమునకు న్యాయము చేయును.శుద్ద వివేక తత్వమునకు అధిస్టాన దేవత అయిన సుబ్రమణ్యం లేక వుధ్భవించదు.దీనినే సుబ్రమణ్యస్వామి శివునికి వుపదేశించారని చెప్పేదారు.

గంగనదీ తీరమున రెల్లుగడ్డి పోధలలో  జన్మించడం ఏమిటి?ఆత్మ సహజ గుణమైన దయను సూచించునది గంగా.ఆత్మ యొక్క అనుభవ మధ్యంతర స్థితి అయిన సహనగుణము సర్వవిషయము లందు అహంకారము తలెత్తకుండా అణకువను కలిగివుండటమును రెళ్లు గడ్డి సూచించును.ఈ రెండింటి మద్య అనగా దయ సహనము అనుభవమునకు సహజ సిద్దముగ  తెలియు విచక్షణా జ్ఞాన మయిన వివేకము అనే జ్ఞానము కలుగుటయే సుబ్రమణ్యస్వామి జననము.

మరి కార్తీక స్త్రీలు పాలు ఇవ్వడము అనగా వివేకము ఉద్భవించునపుడు మాతృశ్రీ యొక్క రూపమయిన శ్యామల అను శక్తి స్వరూపము వెలువడి ఆనంధము అను అమృత కిరణమును వివేకమునందు పొందు పరచుటయే పాలు ఇవ్వడం.

స్వామి అమ్మ దగ్గర శిశువును ఇవ్వగా అమ్మ ఆరు శిశువులను ఏకము చేసి చేతితో నిమరగా ఆరు ముఖములు కలిగి దేహము ఒకటిగాను, కాళ్ళు రెండుగాను,చేతులు పన్నెండుగాను ఉన్డి ప్రకాశించు చున్నది ఏమి అనిన పరమాత్మ అయిన స్వామి అనుగ్రహము అను శక్తి తో దయ అనే నదీ తీరమున సహనము అను రెల్లుగడ్డిపొదలో ఆది కాలమున ఉద్భవించినపుడు శుద్ద విషయ వాసనా వికాసముతో ఆరు నిప్పు రవ్వలుగా శిశువులను అనుగ్రహ దేవతకు ప్రసాదించగా కృపా శక్తి ఎటువంటి వికారములు లేక ఆరు నిప్పు రవ్వలను  జ్ఞానానుగ్రహ హస్తముల ద్వారా దగ్గరకు చేర్చగ విషయవస్థలలో మునగక పిండమునకు ఎట్టి నష్టము లేక ఆరు నిప్పు రవ్వలు తమ ఉనికి మరియు బింబము మారకుండా ఆరుతలలతో ఒక దేహమై అనుభవము మరియు సాధనా శక్తితో సంకల్ప స్థితిలో వెలయుచు సమాధి స్థితి లో ఉన్డుటయే.

పిండమునందు ఈ విధముగా వుండగా అండమునందు వీటికి ఊరు, ఆలయము, మూర్తి, పూజలు, మొదలగునవి ఏర్పరచి యున్నది ఎందుకనగా ఆత్మలు పాప పుణ్య కర్మల ద్వారా విభేదించబడి మందం, మందరం, రాజసం, తామసం, కర్మం మొదలగు బేదముల చే ప్రారంబమై ఇప్పటివరకు జీవరాసులు ఒక్కటే అయినప్పటికి కరణ సంయోగము ద్వారా వేరు వేరు విధములుగా పుట్టి జీవించు చున్నది.అంధువలన మహా కరుణ గల కృపా నిది అయిన ఈశ్వరుని కృప అరచేతిలో వెన్న అని తెలుసుకొని అనాది నిత్యముక్తి సిద్దుడైన ఈశ్వర తత్వ భువనానుభవ ఈశ్వరుని చే మనము అనగా జీవులు ముక్తి పొందు నిమిత్తమై ఈ లోకమున పశు , పతి, పాశం మరియు అనుభవములను తెలుపుటకు వరుసగ పురాణం,వేదం,ఆగమం,ఉపనిషత్తులు,ఆవిష్కరించబడినవి.వాటిద్వారా కర్మఖాన్డం భక్తి ఖాండమ్,ఉపాసనా ఖాండమ్,తంత్రకల, మంత్ర కల, ఉపదేశ కల మొదలగుబెదములు , వీటికి ముఖ్యమైన ఆచారం, వర్ణం, ఆశ్రమం, మొదలగు వాటిని , వాటికి హేతువైన సరియగు నాలుగు చర్య లు , క్రియ, యోగం , జ్ఞానం వీటికి తోడుగా సాలోక్యది నాలుగును( సాలోకం ,సామీప్యం సారూపం,సాయుజ్యం ) వీటికి మార్గమైన తత్వము, భువనము, పరమపదము, వర్ణం, మంత్రం, కళలు, మొదలగునవి నిర్ణయించి, పాపనాశనమునకు హేతువైన అనసన,చాన్ద్రాయణ మొదలగు ప్రా యశ్చిత్తములను,విధించి, వీటిని అనుసరించుటకు యోగ్యమైన నదులు మొదలగు వాటికి అంగములైన తత్వానుభవములైన, నిజమైన నామములు, చెడకుండా ఉండుటకు పవిత్ర నామములు మూర్తి స్థలము మొదలగు వాటిని భగవంతుని సేవ చేయుట కొరకు  ఏర్పాటు చేసి ఉన్నారు.

ఉపాసకులకు తత్వ నామం చెడకుండా కృపా శక్తి యొక్క జ్ఞానము తెలియుటకు కృత్తికనూ,వేదాంత వివరణకు విశాఖమునూ ,ఎల్లప్పుడు శుభము కలుగుటకు మంగళ వారమును, ఆరు జ్యోతులను సూచించుటకు షష్టిని, జ్ఞాన పరిపూర్ణత్వమును తెలుపుటకు తైప్పూసమును పేర్కొని నిర్ణయించియున్నరు.

తత్వములను చేతబుని నాట్యము చేయుచు జ్ఞానము అను చేతితో విషయ ఫలమును తత్వమనే కావడిలో కట్టి తన భుజములపై వుంచి తాను అను అహంభావము నశించి తన్ను తాను ఆ పరమాత్మ స్వరూపుడుగ ఎంచి జ్ఞాన స్వరూపుడై తీవ్ర సంకల్పుడై సుబ్రమణ్య తత్వమై ఆ మూర్తి ముందర విషయాభావ న్యాయమే కావడి.శుద్ద వైరాగ్య నిశ్చల శివ జ్ఞానమే హిడింబా అను రాక్షసునిగా చెప్పబడి యున్నది.

హృదయాకాశ షట్కోన రూపమే యంత్రమై దాని  భాగ విభాగములే 40 ముక్కోణములై ఉపంఘమే  నవ ఖండములై సత్యమే “శ” కరమై, విషయ త్యాగమే “ర” కరమై ,నిత్య తృప్తియే “వ” కరమై నిర్విషయమే “ణ” కరమై పాప నివృత్తి హేతువే “భ” కరమై ఆత్మ ప్రకృతి గుణమే “వ” కరమై వెలయుటయే షడక్షర మంత్రమైనది. (శరవనభవ).

మన శరీర హృదయ స్థానమే ఆలయమై మాయా విచిత్రమే నెమలియై, నాభి అంతమే భలీ పీటమై, కొండ నాలుక యొక్క మూలమే ధ్వజస్థంభమై, పంచ కోశములు ప్రాకారములై ,త్రిగుణములు బిల్వ వృక్షమై, ఆత్మ దయనే తటాకమై, ముఖము మహాద్వారమై , అనుభవ జ్ఞానమే గోపురముగా విధించ బడి యున్నది.

జ్ఞానులు భగవంతుని ఎచ్చోటనైనను, యోగులు హృదయమునందు ,ఖర్మకాండులు అగ్ని ద్వారా  సాధారణ భక్తులు విగ్రహము ద్వారా ఉపాసన చేయుదురు .దానికి అనుగుణముగా తత్వ విచారమును ఆలయములుగా మలచినారు.ఆలయములోని మూర్తి వద్దకు బందములతో ముడిపడి ఉన్న ఆత్మలను శివ పాశముతో బంధించి పశు పాశము ద్వారా పైన చెప్పబడిన రీతిలో తంత్ర మంత్ర కళలను గురువు యొక్క ఉపదేశ మార్గము ద్వారా వివరించి పై ఉపాసనా మార్గముల ద్వారా భక్తులను ఆశీర్వదించి ఖాండత్రియములో నిలకడ చేసి జ్ఞానము నిచ్చి అనుభవ సూక్తితో సమాదియోగమును తెలిపివున్నారు.వీటిని జీవులు మరువకుండా వుండు నిమిత్తమై జింకను చూపి జింకను పట్టు విధముగా ఆలయమునందలి మూర్తి అయిన సుబ్రమణ్య స్వామిని తత్వరూపమున వివరించి ,అర్చకుడు మరియు ఆచార్యుడు జ్ఞానము అను కర్పూరమునన్దు సుబ్రమణ్యం అను సత్యమును , దీపమందలీ ప్రకాశముచూపి అశుద్ధ విషయములు మన చెవిలో పడకుంట ఉండుటకు నాధము అను గంటను మ్రోగించి ఆ శబ్ధము ద్వారా  దేవుని దర్శింప జేసి వేరు విషయములపై మనస్సు మరలక తథ్రూపముగా భక్తులు నిలపడీ ప్రార్థించగా వారి వారి భక్తి ప్రవృత్తుల మేరకు తత్ఫలితములను  ప్రసాధించుటకు అన్న ప్రసాద వినియోగము చేయుటయే తగిన మార్గమని సిద్ధాంతముని ఏర్పరిచినారు.  ఈ విధముగా అనాధి నుండి ఇప్పటివరకు అరున-ణగిరినాధ,ర్ కుమార గురుభరర్, నత్కీరర్ మొదలగు మహానుభావులు సేవలుచేసి ఉత్తమ జ్ఞానులై నిత్యముక్తులై  వెలసిఉన్నారు.  కావున మనమందరమూ ఆ నిజమైన దేవుడిని వేదాగమ విధులతో నిజమైన భక్తి తో స్తుతించి స్వామి అనుగ్రహము పొందవలయును.



                                                                 సమాప్తం    

Thursday, March 24, 2022

సన్మార్గ పురుషార్థము మరియు సచ్ఛీలత

 పురుషార్థములు – 4

శుద్ధ సన్మార్గములో మనము పొందవలసిన పురుషార్థములు  4. అవి, 

1. హేమ సిద్ధి (దేనినైనా స్వర్ణముగా మార్చగల శక్తీ; భౌతిక దేహమును సైతం)

2. అమర విద్య (మరణమును జయించుట)

3. తత్వ నిగ్రహము (36 తత్వములను మరియు వాటి 60 తాత్వికములను జయించుట)

4. భగవంతుని స్థితిని గ్రహించి, మనమూ ఆ స్థితిని పొందుట.


సచ్ఛీలత - 4

పై చెప్పబడిన పురుషార్థములను పొందుటకు పాఠించవలసిన సచ్ఛీలతలు 4. అవి, 

1. ఇంద్రియ సచ్ఛీలత 

2. కరణ సచ్ఛీలత 

3. జీవ సచ్ఛీలత 

4. ఆత్మ సచ్ఛీలత


1. ఇంద్రియ సచ్ఛీలత 

ఇంద్రియములు 2 రకములు. కర్మేంద్రియములు మరియు జ్ఞానేంద్రియములు. 

చెడు మాటలు చెవిన పడకుండా నాదము మొదలైన స్తోత్రములను వినవలెను.  

అశుధ్ధ స్పర్శ లేకుండా దయతో స్పర్శించవలెను. 

క్రూరముగా చూడరాదు.

రుచిని ఆశించరాదు.  

సుగంధములను కోరరాదు. 

మంచి మాటలు పలుక వలెను. 

అసత్యములను పలుకరాదు. 

జీవహింస జరుగునపుడు, ఏ విధమైన తంత్రముతోనైననూ దానిని నివారించవలెను. 

మహానుభావులు, మహర్షులు, యోగులు నివసించిన (పుణ్యక్షేత్రములు, జీవ సమాధులు మొదలైనవి)ప్రదేశములను దర్శించవలెను. 

జీవ ఉపకారమునకై సాధువులు నివశించు స్థలములలో సంచారము చేయవలెను. 

మలజలములను క్రమబద్ధీకరించుకొనవలెను (తక్కువ ఎక్కువ కాకుండా). అది ఎటులననగా, మిత ఆహారము, మిత భోగములతో క్రమబద్ధీకరించుకొనవలెను. ఒక వేళ కాల బేధముతో కానీ, ఉష్ణ బేధముతో కానీ క్రమము తప్పినపుడు ఔషధములు, భౌతిక మూలములు, చరబేధ హస్తస్పర్శ తంత్రము వలన కానీ, మూలాంగ ప్రణవ ధ్యాన సంకల్పము చేత కానీ, క్రమము తప్పకుండా చేసుకొనవలెను. 

శుక్లమును అక్రమ, అధిక్రమములో వదలకుండా ఉండవలెను. (ఇందులో తీవ్రతరము, ఏ విధముగానైననూ శుక్లమును బయటకు వదలకుండుట)

ఎల్లప్పుడూ దేహమును కవచముతో (వస్త్రముతో) కప్పి ఉండవలెను. ఇలా తల, ఛాతి, నడుముకు క్రింది భాగము మొదలైన వాటిని కప్పి ఉంచవలెను. 

బయట నడిచే సమయములో తప్పకుండా కాలికి పాదరక్షలు ధరించవలెను. 

మాసిన వస్త్రములను ధరింపకుండుట మొదలైనవి ఇంద్రియ సచ్ఛీలతలు.

2. కరణ సచ్ఛీలత 

సత్యమైన పరబ్రహ్మ ఒక్కడే అని సత్య సంకల్పము చేసుకొనవలెను. 

చిత్ సభనందు మనస్సును లగ్న పరచుట. అది కాక మరి ఏ చోటనూ మనస్సును సంచరింపచేయక చిత్ సభనందు అనగా భగవంతునియందు మనస్సును లగ్నపరచవలెను. 

జీవ దోషములను (అనగా ఇతరుల తప్పులను) విచారించరాదు. 

చెడు విషయములలో మనస్సును లగ్నపరచరాదు. 

నేను అన్న అహంభావము, తనను తాను గొప్పవానిగా తలచుట మొదలైన వాటిని నిర్మూలించవలెను. 

వికృత గుణములవలన కలిగిన చెడుని నిర్మూలించి, ప్రకృతియైన సత్వములో ఉండవలెను. 

ఇతరుల పట్ల ఆగ్రహింపరాదు. 

తమ శత్రువులైన తత్వములు - అరిషడ్వర్గములపై ఆగ్రహించి వాటిని తొలగించవలెను.

3.  జీవ సచ్ఛీలత 

ఆడ, మగ మొదలైనవారి అందరిపట్లనూ జాతి, కులము, మతము, ఆశ్రమము, సూత్రము, గోత్రము, శాస్త్రము, దేశమార్గము, పేద, ధనిక అను భేదములు లేక, అందరినీ తమవారి వలె సమానముగా భావించుట.

4. ఆత్మ సచ్ఛీలత 

84 లక్షల యోనిబేధము గల జీవుల సూక్ష్మములో ఉన్నది ఆ భగవంతుడేనని గ్రహించి, ఆ జీవుల ఆత్మయే భగవంతుడు కొలువైన దివ్య సభగా, అందులోని ప్రకాశమే పతి (భగవంతుడు) గా చూచి,  ఏ విధమైన బేధము లేక అన్నీ తానే అయి ఉండుట.

ఈ విధముగా ఉండినపుడు, పై చెప్పిన దివ్య పురుషార్థములు కైవశమగును. ఏకత్వము అనునది తన జ్ఞానముతో సచ్ఛీలత కలిసి ఒక్కటైనప్పుడు, తనంతటతానే కలుగును. ఇతర సమయములలో, తన వల్ల ఇతరులకు హింస కలుగకుండా, వారు హింసించిననూ తాను సహించి ఉండవలెను. 

పై చెప్పబడిన 4 సచ్ఛీలతలలో మొదటి రెండూ మానవ ప్రయత్నము వల్ల సాధ్యము కాగా, క్రింది రెండు, దైవానుగ్రహము వల్లనే సాధ్యమగును.

జీవకారుణ్య సచ్చీలత


కృప/ అనుగ్రహము అనునది భగవంతుని దయ, దేవుని సహజ సిద్ధ స్వరూపము. జీవకారుణ్యమనునది జీవుల యొక్క దయ., అనగా జీవాత్మ యొక్క సహజ సిద్ధ స్వరూపము. అందువలన దయ ద్వారానే దయను అనగా జీవుల సహజ స్థితి అయిన జీవకారుణ్యము ద్వారానే భగవంతుని సహజ స్థితి అయిన ఆయన అనుగ్రహమును పొందగలము.

జీవకారుణ్యము ద్వారా మాత్రమే భగవత్ కృపను పొందవచ్చును. కావున జీవకారుణ్య సచ్ఛీలతయే జ్ఞానమార్గము మరియు సన్మార్గము అని గ్రహించవలెను.

జీవుల యొక్క సహజ స్వభావమగు దయ, మరియు భగవంతునిచే సృష్టింపబడిన అన్ని జీవులు సహోదరత్వమును కలిగి ఉండుటయే జీవులకు జీవుల పట్ల కలుగు దయకు ఆధారముగా ఉన్నది.

జీవులు ఆకలి, దాహము, అనారోగ్యము, కోరికలు, పేదరికము, భయము, మరియు ప్రాణభయముతో బాధపడుతున్నాయని తెలిసినా, చూసినా, వినినా ఆత్మ ద్రవించును. అనారోగ్యము మరియు కోరికలు ఉన్నప్పటికీ జీవులు ఎక్కువ కాలము జీవించుటకు సాధ్యము కలదు. కానీ, ఆకలి మరియు ప్రాణాపాయ స్థితులను వెంటనే నివారించనిచో ఆ జీవి ప్రాణాలను కోల్పోవును.

ఆకలి మరియు ప్రాణాపాయముల వలన కలుగు బాధ ఒకే విధముగా ఉండును. కావున ఆకలి మరియు ప్రాణాపాయములకు గురికాకుండా ఆ బాధను నివారించుటయే జీవకారుణ్య సచ్ఛీలత యొక్క ప్రధాన లక్ష్యము.

ఒక జీవి ఆకలితో ప్రాణాలను కోల్పోవును అని తెలిసిన వెంటనే, ఆకలిని తీర్చి ఆ ప్రాణాలను కాపాడుటకు జీవకారుణ్యమును అనుసరించువారు ఇతర జీవులను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుటకు వెనుకాడరు.

ఆకలి బాధ 

జీవులకు ఆకలి అధికమైన కాలములో 

1. జీవజ్ఞానము వికసించక మసకబారును - అది మసకబారినపుడు, జ్ఞానము అనే భగవత్ శక్తి  అదృశ్యమగును - అది మరుగైనపుడు పురుషతత్వము కృశించును - అది కృశించినపుడు ప్రకృతి తత్వము మసకబారును - అది కనపడనపుడు గుణములు మార్పుచెందును - మనస్సు స్థిరత్వమును కోల్పోవును  - బుద్ధి చెడుతుంది - చిత్తము కలత చెందును - అహంకారము నశించును, ప్రాణాంతకమగును - దేహములోని పంచ భూతములు బాధింపబడును - వాత, పిత్త, శ్లేష్మములు తమ స్థితిలో మార్పు చెందును.

2. కళ్ళు మసకబారి చూపును కోల్పోవును. చెవులు వినికిడి శక్తిని కోల్పోవును - నాలుక ఎండిపోవును. 

3. చర్మము సన్నగిల్లి స్పర్శను కోల్పోవును - కాళ్ళు చేతులు శక్తీ హీనమై తడబడును - వాక్కు యొక్క ధ్వని మార్పు చెంది మాటలు తడబడును. 

4. మలజల మార్గములు నీరసించును - శరీరము నల్లబడును - రోమములు నిక్కబొడుచుకొనును - నరములు మెత్తబడును - నాడులు తమ సహజత్వమును కోల్పోవును - ఎముకలు నల్లబడి కీళ్లన్నియు ధృఢత్వమును కోల్పోవును - గుండె దడదడలాడును - మెదడు కృశించును - శుక్లము ఎండిపోవును - కాలేయము ద్రవించును - రక్తము మరియు నీరు ఇంకిపోవును - మాంసము మెత్తబడి తన సహజత్వము చెడును - కడుపు భగభగ మండును - కోపతాపములు ఎక్కువగును. ప్రాణము వదిలిపోవుటకు చెరువుగానున్న అన్ని సంకేతాలు కనబడును. 

ఆకలి వలన ఇన్ని అవస్థలు జీవులన్నింటికీ ఒకే విధముగా వుండును.
1. ఆకలి అనే అగ్ని పేదవారి శరీరమును చుట్టుముట్టి మండునపుడు వారికి ఆహారము ఇచ్చి ఆ అగ్నిని చల్లార్చుటయే  - జీవకారుణ్యము. 

2. ఆకలియను విషపూరితమైన గాలి పేదవారి జ్ఞానమనే దీపమును ఆర్పు తరుణములో ఆహారము ఇచ్చి ఆరకుండనట్లు చూచుటయే - జీవకారుణ్యము. 

3. భగవంతుని అంశమై వెలసే దేహములనే ఆలయములు, ఆకలివలన పాడుబడునపుడు ఆహారము ఒసగి ఆ ఆలయములను వెలయునట్లు చేయుటయే - జీవకారుణ్యము. 

4. భగవంతుని అనుగ్రహము పొందు నిమిత్తము, దేహములోని జీవుడు, ఆకలివలన తమ స్థితిగతులను కోల్పోయి నశించునపుడు,  ఆ జీవికి ఆహారము ఇచ్చి స్థిరముగా ఉండునట్లు చేయుటయే జీవకారుణ్యము. 

5. ఆకలియనే పులి పేదల యొక్క ప్రాణముల పైకి దూకి చంపు సమయములో ఆ పులిని చంపి ఆ ప్రాణములను కాపాడుటయే జీవకారుణ్యము.
6. నడిచి నడిచి కాళ్ళు జీవములేక, అడిగి అడిగి నాలుక తడబడి, తలచి తలచి మనస్సు చలించి నిర్వీర్యమై ఈ కడుపును ఏమి చేయగలము అని కన్నీరు కార్చే పేదలకు ఆహారము ఒసగి ఆ కన్నీటిని తుడుచుటయే జీవకారుణ్యము. 

7. రోజు గడిచినది - ఆకలి బాధించుచున్నది. వేరు ప్రదేశములకు వెళ్లి అడుగుటకు సిగ్గుగా ఉన్నది. నోరు తెరచి అడుగుటకు మానమర్యాదలు అడ్డుపడుచున్నవి. కడుపు మండుచున్నది, ప్రాణము విడుచుటకు ఉపాయము తెలియకున్నది. ఈ జన్మ ఎందుకు? అని మనస్సు, ముఖము వాడిపోయి, వివరించుటకు మాటలు రాక, స్వప్నముగన్న మూగవారివలె మనస్సునందు మధనపడే మానస్థులైన జీవులకు ఆహారము ఇచ్చి వారి మానమును కాపాడుటయే జీవకారుణ్యము. 

8. గత జన్మలో మనము, ఆకలిగా ఉన్నవారి ఆకలిని తెలుసుకొని ఆ ఆకలిని తొలగించియున్న, ఈ జన్మలో మన ఆకలి తెలుసుకొని ఆ ఆకలి తీర్చుటకు వేరొకరు ఉండేవారు. ఆ జన్మలో మనము చేయలేదు అని ఈ జన్మలో మనకు బాధ తీర్చేవారు లేదని అర్థము చేసుకొని, నిద్ర రాక దుఃఖించే పేద జీవులకు ఆహారము ఒసగి దుఃఖమును పోగొట్టి నిద్రించేలా చేయుటయే జీవకారుణ్యము. 

9. దేహములోని అన్ని నరములు పైకి కనపడగా, ఆకలి వలన కృశించి, స్పృహతప్పే కాలములోనూ అన్యులను అడుగుటకు మనస్సు రాక ఆలోచన చేసి చేసి అగ్నిలో పడుకొని నిద్రించువారిలాగా, పొత్తికడుపులో జఠరాగ్నిని ఉంచుకొని పడుకొనే వివేకవంతులకు ఆహారము ఇచ్చి ఆ జఠరాగ్నిని ఆర్పుటయే జీవకారుణ్యము.

10. కళ్ళు, చేతులు, కాళ్ళు మొదలైన అన్ని అంగములు ఎటువంటి వైకల్యము లేకుండా ఉండి ఆహారము సంపాదించుకొనే  శక్తికలిగిన వారే ఇలా బాధపడుచూ పడుకొని ఉన్నారు - మరి గుడ్డి, చెవుడు, మూగ మరియు అంగహీనులుగా ఉన్న మనకు ఆహారము ఏ విధముగా లభించును? - ఆకలి ఏ విధముగా తొలగును? అని పలు విధములుగా అలోచించి దుఃఖించు పేద వారికి ఆహారము ఇచ్చి వారి దుఃఖమును తొలగించుటయే జీవకారుణ్యము. 

11. ఆకలితో బాధపడువారు ఏ దేశమువారైననూ, ఏ మతమునకు చెందినవారైననూ, ఏ జాతివారైననూ, ఏ కృత్యములు చేయువారైననూ, వారి వారి జాతి, మత, దేశ, కృత్యములను గురించి ఆలోచించకుండా అన్ని జీవులయందు ఉన్న భగవంతుని అంశము ఒక్కటై ఉండుటవలన వారి ఆకలిని నివారించుటయే జీవకారుణ్యము.

"జీవకారుణ్యమే మోక్షగృహమునకు తాళపుచెవి"

జీవకారుణ్యమనే మోక్ష గృహము యొక్క తాళపుచెవిని సకాలములో సంపాదించుకొన్న గృహస్థులు - చర్య, క్రియ, యోగము, జ్ఞానము మొదలైన సాధనములను ఆశించక, ఏ కాలములోనూ పొందలేని మోక్షగృహము యొక్క తలుపులు తెరుచుకొని లోనికి వెళ్లి నిత్య ముక్తులుగా జీవించెదరు. 

1. పుణ్యభూములను ప్రదక్షిణము చేయుట, 2. పుణ్యతీర్థములందు స్నానమాచరించుట, 3. పుణ్యక్షేత్రములలో నివశించుట, 4. పుణ్యమూర్తులను దర్శనము చేయుట 5. స్తోత్రము చేయుట, 6. జపములుచేయుట, 7. వ్రతములు చేయుట, 8. యోగములు చేయుట 9. పూజలు చేయుట మొదలైన చర్యక్రియలను చేసే భక్తులు నిద్ర ఆహారములను వీడి, విషయ వాసనలను తొలగించి ఇంద్రియములను కట్టడి చేసి మనోలయము చేసి యోగము చేయు యోగులు, అనంతమైన శక్తులను పొందిన సిద్ధ పురుషులు, అన్ని బంధములను వీడి బ్రహ్మానందమును పొందిన జ్ఞానులు, జీవకారుణ్యమనే తాళపుచెవిని సంపాదించుకోకుంటే, మోక్షమనే ఉన్నత గృహ సమీపమునకు చేరి వేచియుండి తిరిగి ఆ తాళపు చెవిని సంపాదించుటకు ఇక్కడికి వచ్చెదరు కానీ ఆ మోక్షావాకిలి తెరచుకొని లోనికి వెళ్లి జీవించలేరని సత్యప్రమాణముగా తెలుసుకొనవలెను. 

అందువలన జ్ఞానము కలిగిన జీవులందరికీ 'జీవకారుణ్యమే భగవంతునికి చేయు ఆరాధన' అని గ్రహింపవలెను. 

జీవకారుణ్య సచ్ఛీలత లేకుండా జ్ఞానము, యోగము, తపము, వ్రతము, జపము మొదలైనవి చేయువారు, భగవంతుని కృపాకటాక్షములను లేశ మాత్రమైననూ పొందలేరు. వారిని ఆత్మ దర్శనము పొందినవారుగా తలచుకొనరాదు. జీవకారుణ్యము లేకుండా చేసే కార్యములన్నియు ప్రయోజనము లేని మాయాజాల కృత్యములు అని తెలుసుకొనవలెను.
1. కాగా, కుష్టు మొదలైన తీరని వ్యాధులతో బాధపడే సంసారులు, తమ తాహతకు తగిన విధముగా ఆకలిగొన్న వారి ఆకలితీర్చుటను వ్రతముగా అనుసరించినచో వారి జీవకారుణ్య అనుసరణ మంచి ముందులాగా వారి వ్యాధులను నివారించి, విశేష సోఖ్యమును కలిగించును.  

2. చాలా కాలముగా సంతానము లేక పలురకములైన వ్రతములు ఆచరించి బాధపడుచున్న గృహస్థులు, తమ తాహతకు తగిన విధముగా ఆకలిగొన్న వారి ఆకలి తీర్చుటయే వ్రతముగా ఆచరించిన, ఆ జీవకారుణ్య అనుసరణ వారికి మంచి జ్ఞానము కలిగిన సంతతిని కలిగించును. ఇది సత్యము. 

3. అల్పాయుష్కులని విచారించి తెలుసుకొని మరణించుటకు భయపడి విచారించే గృహస్థులు తమ తాహతకు తగిన విధముగా ఆకలితో బాధపడే దీనుల ఆకలిని పోగొట్టుటను వ్రతముగా ఆచరించినచో ఆ జీవకారుణ్య అనుసరణ వారికి దీర్ఘాయుష్షును కలిగించుననునది సత్యము. 

4. విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటి కోసం బాధపడే గృహస్థులు, తమ తాహతుకు తగిన విధముగా ఆకలితో ఉన్న పేదల ఆకలిని పోగొట్టుటయే వ్రతముగా అనుసరించిన, ఆ జీవకారుణ్య అనుసరణ విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటిని కలిగించును. ఇది సత్యము. 

5. ఆకలితో బాధపడేవారి ఆకలి తీర్చుట అను వ్రతమును ఆచరించు గృహస్థులను వేసవికాలములో  ఎండవేడిమి బాధించదు. భూమి కూడా వేడిని కలిగించదు; పెద్ద వర్షము, ఘనమైన గాలి, పెద్ద పిడుగు, మహాగ్నికీలలు మొదలైన ఉత్పాదకాలు దుఃఖమును కలిగించదు. విషగాలి, విషజ్వరము మొదలైన అసాధారణ వ్యాధులు కలుగదు; ఆ జీవకారుణ్యము కలిగియున్న గృహస్థులు వరదలవల్లనూ, దొంగలవలననూ, శత్రువులవలనను కలతచెందరు; రాజులవలనను, దేవతలవలననూ  అవమానింపబడరు. 

జీవకారుణ్యము గల సంసారుల భూములలో మిక్కిలి ప్రయాస లేకయే అథిక పంటలు పండి సస్యశ్యామలముగా ఉండును. వ్యాపారములో ఏ ఆటంకము లేకుండా లాభములు వచ్చును. ఉద్యోగములో బాధలు లేకుండా ఉన్నతమైన స్థితి కలుగును. వారి చుట్టూ బంధువులు, సేవకులు ఉందురు. దుష్టమృగములవలననూ, దుష్ట జంతువులవలనను, దుష్ట పిశాచముల వలనను, దుష్ట దేవతలవలనను భయముచెందరు . 

జీవకారుణ్యము గల గృహస్థులకు ఎటువంటి ఆపదలు అజాగ్రత్తవలనను, ప్రారబ్ధమువలనను సత్యప్రమాణముగా కలుగదు. 

ఆకలిగొన్న వారి ఆకలితీర్చి సంతోషము కలిగించే జీవకారుణ్య సచ్ఛీలత అను మేలైన వ్రతము - దేవతలు, మనుష్యులు, బ్రహ్మచారులు, గృహస్థులు, తపోధనులు, సన్యాసులు, పురుషులు, స్త్రీలు, ముసలివారు, యవ్వనములో ఉన్నవారు, అన్ని జాతులవారు పాటించవలెను అనుట భగవంతుని ఆజ్ఞ అని తెలుసుకొనవలెను.

వాళ్ళలార్ అనుగ్రహించిన మహోపదేశము


శ్రీముఖ సం|| ము ఆశ్వయుజ మాసము 7 వ రోజు బుధవారము పగలు 8:00 గం|| కు మేట్టుకుప్పం లోని సిద్ధివళాగ భవనము నందు మొట్టమొదటి సారిగా సన్మార్గ పతాకమును ఆవిష్కరించినపుడు జ్యోతి రామలింగ స్వామి వారు ఉపదేశించిన మహోపదేశ సారము. 


అందులోని ప్రధాన అంశములు:


1. సత్విచారము 

2. ఆత్మ సాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న అజ్ఞాన తెరలను తొలగించుట 

3. దయ


1. సత్విచారము 


ఇక్కడున్న మీరందరూ ఇంతకు మునుపు వలె కాలమును వృధా చేయకండి. ఇది మొదలు శాలకు (ధర్మశాలకు), భగవంతుడు వచ్చు  10 దినములు అనగా కొంత కాలము వరకు మీరందరూ మంచి విచారణలో నిమగ్నులై  ఉండండి. ఆ విచారణ ఏమనగా, మనము మన యొక్క స్థితి ఎటువంటిది? మనకు అధిష్టానమైన భగవంతుని స్థితి ఎటువంటిది? అని విచారణ చేయవలెను. దానికి తగినట్లుగా మీరందరూ కలిసి గానీ లేక వ్యక్తిగతముగా గానీ మీ జ్ఞానమునకు, సంస్కారమునకు తగినట్లు ఉన్నవారితో కలిసి యైనను విచారణ చేయవలెను. 


సదరు సత్విచారము - పరము, అపరము అని రెండు విధములైయున్నవి. అందులో పరము అనునది పరలోక విచారము. అపరము అనునది ఇహలోక విచారము. వీటిలో ఇహలోక విచారము అనునది విచారము కాదు. సాధారణముగా ఒకడు విచారించుచున్నాడు అనిన అట్టి విచారము నిజమైన విచారము కాదు. ఎందుకనగా విచారము అనుటకు అర్థము వి - చారము లో (వి) సాధారణ లౌకిక విచారమును పోగొట్టుటకు వచ్చినది అని భావింపవలెను. కావున అది పరలోక విచారమును సూచించదు. వి - చారము యొక్క నిజమును గ్రహించక విచారము అనే పదమును దుఃఖమునకు సంకేతముగా వాడుచున్నాము. కానీ మనము ప్రాపంచిక అర్థమును తీసుకొనరాదు. అది తప్పు. 


చారము అనగా దుఃఖము. విచారము అనగా దుఃఖమును పోగొట్టునది (దుఃఖనివారణము). వి' అనునది ఉపసర్గము. చారము అను దుఃఖమును పోగొట్టునది విచారము. కనుక సత్విచారము అనునది ఇహలోక విచారమునుగాక పరలోక విచారమును మాత్రమే సూచించును. కావున మనము నిరంతరము విచారణా తత్పరులుగా ఉండవలెను. 


సత్విచారము రెండు రకములుగా ఉన్నది. అవి, 

1. అండ విచారము 

2. పిండ విచారము


1. అండ విచారము: 


విశ్వములో (అండము) సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించి అనగా అవి ఏమి? వాటి స్వరూప స్వభావములు ఎటువంటివి? అను విషయముల గురించి ఆలోచన చేస్తూ ఉండవలెను. 


2. పిండ విచారము: 


దేహములో (పిండము) మనము ఎవరు? (నేను ఎవరిని?) ఈ దేహములో కళ్ళు, భ్రూమధ్యములు, చేతులు, మరియు ఇతర భాగములు, వాటి యందు కొన్నింటికి  రోమములు కలుగుట మరి కొన్నింటికి అనగా అరచేయి మొదలైన భాగములలో రోమములు కలుగకుండుట ఏ విధముగా జరుగుతున్నది? కాళ్ళు, చేతుల వ్రేళ్ళలో గోళ్లు ఎందుకు, ఎలా వచ్చుచున్నది? ఈ రకముగా ఇతర అన్ని అవయవముల తత్వములను స్వరూప రూప స్వభావములను గురించి విచారము చేయవలెను.


2. ఆత్మ సాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న అజ్ఞాన తెరలను తొలగించుట:


మీరు ఈ విధముగా సత్విచారము చేస్తూ ఉన్న యెడల, ఆత్మసాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న పలు అజ్ఞానపు తెరలలో ముఖ్యమైనది, గాఢమైనది మరియు మొదటిది అయిన పచ్చని తెర ముందుగా తొలగును. ఆ మొదటి తెర తొలగిన పిమ్మట మిగిలియున్న తెరలు ఒక్కొక్కటిగా తొలగిపోవును. ఆ పచ్చ వర్ణము ఎటువంటిది అనగా నల్లని వర్ణముకు ప్రథమమైనది ఆ పచ్చ వర్ణము. నల్ల వర్ణమును ఎక్కువగా ప్రభావితము చేయునది పచ్చ వర్ణమే. 


ఇటువంటి గాఢమైన తెర (పచ్చ తెర) తొలగవలెనని దైవమును స్తోత్రము చేయుట వలననూ, ఎపుడూ దైవ చింతనతో ఉన్నపుడు మన యొక్క బలహీనతలను, చెడు చింతనలను దేవుని ముందు విన్నవించుచూ తనకు ఉత్తమ మార్గమును బోధించవలెనని ఎల్లప్పుడూ విచారములో దేవుని ప్రార్థించుచూ తమ ప్రయత్నమును విడనాడక ఉన్నచో మనము పొందవలసిన జ్ఞానమును పొందగలము.


నీటియందు గల పాచీలను తొలగించునట్లు మన ఆత్మను కనుగొనలేక మూసియున్న రాగద్వేషములతో కూడి యున్న పచ్చని మాయ తెరను అతి ఉష్ణముతో తప్ప వేరే ఇతర ఉష్ణములతో తొలగించలేము. ఆ ఉష్ణము ఎటువంటిదనిన యోగి యొక్క అనుభవములలో తెలుసుకొనవచ్చును. దానిని సాధారణ మానవులు చేయలేరు. కానీ, దానికన్ననూ దైవమును స్తోత్రము చేయుటవలననూ, సదా దైవమును చింతించుట వలననూ అథికమైన ఉష్ణము కలుగును. యోగులు అరణ్యములకు, కొండలు, గుహలు మొదలగు ప్రదేశములకు పోయి వంద సం|| వేయి సం|| ల కాలము తపస్సు చేసి ఈ ఉష్ణమును పొందుచున్నారు. ఈ విధముగా ఎక్కడో పోయి ఉష్ణమును పొందుటకంటే దైవాన్ని స్తోత్రం చేయుట వలననూ, ఎల్లప్పుడు ధ్యానించుటవలననూ, యోగులు పొందు ఉష్ణమునకన్ననూ ఎక్కువ ఉష్ణము (కోటి పది కోట్ల రెట్లు) మనము పొందవచ్చును. అది ఎటుల అనగా ఒక జామ సమయము ఇహలోక విచారము లేక పర విచారము మాత్రము చేయుచూ మన ఆత్మ, మనస్సు కరుగునట్లు దైవమును చింతించుచున్న యెడల లేక స్తోత్రము చేయుచుండినపుడు ఆత్మను కనుబరచక  మూసియున్న తెరలు వైదొలగును.


అజ్ఞానపు తెరల వరుసక్రమము:


1. నల్లని తెర (మహా మాయ)

2. నీలిరంగు తెర (శుద్ధ మాయ)

3. పచ్చని తెర (క్రియా శక్తీ)

4.  ఎరుపురంగు తెర (పరా శక్తీ)

5. పసుపురంగు తెర (ఇచ్చా శక్తీ)

6. తెలుపురంగు తెర (జ్ఞాన శక్తీ)

7. మిశ్రమ రంగు తెర (ఆది శక్తీ)


పైతెరలన్నీ తొలగిన పిమ్మట అరుట్పెరుం జ్యోతి దైవము యొక్క అనుభవము మనకు సిద్ధించును.


3. దయ మరియు దాని ఆవశ్యకత 


కరుణ/దయయే శివము (దైవము) అనే భావము కలిగియుండుటయే సచ్ఛీలత మరియు సత్య మార్గము. నన్ను అనగా జ్యోతి రామలింగ స్వామిని, ఎవ్వరూ పొందలేని మహాభాగ్యమును పొందు నిమిత్తమై ఎవ్వరూ ఎక్కలేని ఉత్తమ శిఖరాగ్రమునకు నన్ను ఎక్కించినది దయ అను కరుణ మాత్రమే.   


ఆ దయ సమిష్టిగా ఉండవలెను. అనగా అన్ని జీవుల పైన ప్రేమ, కరుణ ఉండవలెను. సమిష్టి ప్రేమ వలనే దయ ఉదయించును. ఇప్పుడు నా యొక్క జ్ఞానము అండ పిండ బ్రహ్మాండములను ఆపై కూడా విస్తరించియున్నది. ఇక్కడ ఉన్న జీవుల గురించి మాత్రమే కాక యావత్ జగత్తులోని జీవుల గురించి దేవుని వద్ద విన్నవించుకొన్నాను. ఎందుకు ఆలా విన్నవించుకొన్నాను అనగా మనమందరమూ సహోదరులము. నేను ఆ రకమైన ఆత్మబంధుత్వ హక్కును కలిగి యున్నను. 


ఒక పదార్థమును అనుభవించినగానీ దాని రుచి మనకు తెలియదు. అట్లు రుచి తెలియని పదార్థముపై మనకు మక్కువ కలుగదు. అటులనే దైవమును ఉన్నదియున్నట్లు అనుభవించిన గానీ దైవముపై మనకు ప్రీతీ కలుగదు. కావున దైవమును తెలుసుకోన వలెననే ముఖ్య లక్ష్యమును సంకల్పముగా ఎంచి సత్విచారము చేయవలెను. 


మనము పొందవలసిన ముఖ్యమైన మరియు చివరిదైన ఆత్మలాభము యేదనిన శివానుభవమే తప్ప వేరు కాదు. ఇక్కడ ఉన్న అందరికి స్వర్గ, నరక విచారము లేదు. (సన్మార్గులకు స్వర్గ నరకాదులు లేవు). అట్లు స్వర్గ నరక విచారము కలిగిన వారు తమ సంకల్పానుసారము పలు సాధనములు చేసి అల్ప ప్రయోజనములను పొంది భగవంతుని చెంతను చేరి కరుణ, దయ అనే తత్వములను గురించి తెలుసుకొని ఆపై ప్రయత్నించి దేవుని దయ వలన సిద్ధిని పొందెదరు. ఇది అపూర్వము.  


మన దేవుడు ఆజ్ఞాపించినది ఏమనగా మనయొక్క సాధనము కరుణ, దయ. కావున మనకు మొదటి అభ్యాసముగా ఈ క్రింది మంత్రమును ఉపదేశించియున్నారు. 



మహామంత్రము:


ఆరుట్పెరుం జ్యోతి                ఆరుట్పెరుం జ్యోతి 

తనిప్పెరుం కరుణై                   ఆరుట్పెరుం జ్యోతి


అనగా, 


దివ్యానుగ్రహ జ్యోతి                 దివ్యానుగ్రహ జ్యోతి 

అసమాన కరుణాసాగరం         దివ్యానుగ్రహ జ్యోతి

దయ, కరుణ, అనుగ్రహము అను పదములు ఒకే భావమును కలిగినది. కావున ఎక్కువ దయ కలిగిన జ్ఞానమే పూర్ణత్వము పొంది యెనలేని ఆనందమును కలిగించును. దీనినే వ్యాజ్యార్ధము అందురు. ఈ రకముగా సాధన  చేసి, పూర్ణ సంతోషానుభవము పొందుటకు ఏ ఆటంకము లేదు. 


సత్యమును చెప్పుటకే వచ్చియున్నాను. సత్యమునే పలుకుచున్నాను అని చెప్పినా తెలుసుకొనువారు లేరు. ఇపుడు పతాకమును ఆవిష్కరించినందు వలన ఇక అందరు సత్యమును గ్రహించెదరు. మనకు ముందున్నవారు సత్యమును కనిపించనీయక కప్పియుంచినారు. ఈ తరుణమున భగవంతుడు ఈ విషయమును (సత్యమును) తెలియబరచియున్నారు. ఇంకనూ తెలియచేస్తారు. కావున మీరందరూ నిజమును తెలుసుకొనండి. 


ఇపుడు నేను చెప్పినట్లు జాగ్రత్తగా నిజమైన జ్ఞానముతో సత్విచారము చేస్తూ ఉండగలరు. ఈ సత్విచారము దయతో కూడినదిగా ఉండవలెను. అది అత్యవశ్యము. ఆ దయ కలుగుటకు హేతువైన హక్కు కూడా కలిగియుండవలెను. ఈ రకముగా సత్విచారము చేస్తూ ఉన్నపుడు, భగవంతుడు వచ్చిన వెంటనే అన్ని శుభములు పొందెదరు. ఇది సత్యము! సత్యము! సత్యము!! ఇది భగవంతుని ఆజ్ఞ!!


అందరికీ తల్లి, తండ్రి, సహోదరులు  మొదలగు ఆప్తులు చేయు సహాయము ఎంతనో అంతకు కోట్ల కొలది అధికమైన సహాయము ఇచ్చునట్టి స్థలము ఈ స్థలము అనగా సిద్ధివళాగము అను మేట్టుకుప్పం. ఇది భగవంతుని ఆజ్ఞ!!