Friday, February 6, 2015

మనము దైవమును ఎందుకు పూజించుచున్నాము?

దైవం/పరబ్రహ్మం  కరుణా సముద్రుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయి మనులను ఎల్ల వేళలా  రక్షించుచున్నాడు. ఈ జీవన సాగరములో కష్ట సుఖములు రెండూ కలిసి వచ్చుచున్నది. మనులను ఎల్ల వేళలా రక్షించుచున్న ఆ దైవం, కరుణా మూర్తి మనులకు ఎందుకు కష్టములను కలిగించుచున్నాడు?

కర్మ సిద్ధాంతం ప్రకారం మనము చేసిన మంచి, చెడులే పాప పుణ్యములుగా, సుఖ దుఃఖాల రూపములో మనము అనుభవించుచున్నాము.

అటులైన మనము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. మరి భగవంతుడిని పూజించుట ఎందుకు? మన కష్టాలను తొలగించమని కోరడమెందుకు?

భగవంతుడిని పూజించుట, ప్రార్థించుట, ఆరాధన చేయుట, నామ సంకీర్తన చేయుట, జపము మొ.. అన్నీ భక్తి అను పదమునకు నిర్వచనాలె!

భక్తి అనునది ఒక విధమైన ప్రేమ గా అభివర్ణించవచ్చు. భగవంతుడు ప్రేమ సాగరుడు. ఆయనను భక్తి అను ప్రేమ తోనే పొందగలం.

ఎటులనిన, మనము ఒకరి పట్ల తప్పు చేసితిమి అనగా, ఆ తప్పును సరిదిద్దుకొనుటకు, మనము పస్చాత్తాపులై వారి మీద ప్రేమను చుపించినచో, వారు మన ప్రేమకు ముగ్ధులై మన తప్పులను క్షమించెదరు. ఇదే విధముగా మనము భగవంతుని యందు ప్రేమ, భక్తి తో ప్రార్తించినచో, ఆయన మన తప్పులను క్షమించి మనకు సుఖ సంతోషములను ప్రసాదించును.

పుణ్య పాప కర్మలు రెండూ నిర్మూలించబడినపుడే జ్ఞానము సిద్ధించి దైవత్వమును పొందెదము.

No comments:

Post a Comment