Monday, February 16, 2015

నాలుగు దశలు

మన జ్ఞానులు మానవుడు దైవత్వమును పొందుట కొరకు నాలుగు దశలను నిర్దేశించినారు.

అవి,

         1. చర్య
         2. క్రియ
         3. యోగము
         4. జ్ఞానము

1. చర్య :

చర్య అనునది పరిశుభ్రముగా  స్నానము ఆచరించి, ఆలయమునకు వెళ్లి దైవ దర్శనం మరియు ఇతర పుణ్య కార్యక్రమములు చేయుట.

ఆలయ దర్శనం మొదటి దశ. దైవమును గూర్చి తెలియని చిన్నారులకు దైవమును పరిచయము చేయుట. దైవమునకు వివిధ రూపములను ఏర్పరిచిరి. వాటికి పురాణ గాధలు, ఉత్సవములు ఏర్పరిచి, ఆ దైవ తత్వము మనకు సులభముగా అర్థముగుటకు కృషి చేసిరి.

వారు రూపొందించిన ప్రతి విషయమునకు ఒక తత్వము కలదు. మానవ శరీరమునే ఆలయముగా నిర్మించిరి. దైవ స్వరూపములలో, పురాణ గాధలలో తత్వమును, జ్ఞానమును ఉపదేశించిరి. మానవుడు ఈ సమాజములో జీవించుటకు కొన్ని మంచి నియమములను నిర్దేశించిరి.

2. క్రియ:

మానవుడు అంతరంగమున తాను అభివృద్ధి చెందినపుడు, ఆలయమునకు వెళ్లి ప్రార్థించుటకనిన ఇంకనూ దైవమును సమీపించాలన్న ఆకాంక్ష పెరుగును. అప్పటివరకు ఆలయములో భక్తునికి, భగవంతునికి మధ్య అర్చకుడు అని ఒకరు ఉన్నారు. భక్తుడు తాను చెందిన పరిపక్కువత కారణముగా తానే స్వయముగా పూజ చేయవలెనని తానే కీర్తనలు పాడి, తన దైవమునకు స్వయముగా తానే సేవలను చేయవలెను అనే కోరిక కలుగును.

భక్తుడు తన గృహమున తన ఇష్ట దైవము యొక్క ప్రతిమను ప్రతిష్టించి తన మనసునకు తోచిన విధముగా పూజలు చేసి ఆనందించును. కీర్తనలు, స్తోత్రములు పాడి పరవశించును. భగవంతునికి భక్తునికి మధ్య వేరొకరు రావడం ఈ స్థితిలో తాను అంగీకరించడు.

మొదటి దశలో అన్ని పుణ్యక్షేత్రములను దర్శించి, పుణ్య నదులలో స్నానములు ఆచరించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో పుణ్య క్షేత్రములు దర్శించి ప్రార్థించుటను తగ్గించి, తానే స్వయముగా పూజలు చేయుటకు ఆశక్తి చూపును. అభిషేకం, ఆరాధన, అలంకారం, యజ్ఞం, హోమం మొ అనేక క్రియలలో నిమఘ్నమై ఆనందించును. దీనినే క్రియ దశ అని అందురు.

3. యోగం:

మూడవ దశ యోగం. మొదటి దశలో ఆలయమును దర్శించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో తానే పూజలు, హోమములు చేసిన కర్మ సాధకుడు, ఇంకనూ కొంచెం ఆలోచనా జ్ఞానము పెరిగినప్పుడు, మనము శిల్పములను, లోహములనే ఇప్పటి వరకు పూజించుచున్నాము. మన పూర్వీకులచే సాక్షిగా నిర్ధేశించబడినవే కదా ఇవి అని ఆలోచించునప్పుడు, వాటిని, వాటిని వివరించు, వివరింప జేయు గురువులను అన్వేషించును.

మొదటి తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన వారు రెండవ తరగతికి పంపబడుతారు. అక్కడనూ బాగా అభ్యసించి ఉత్తీర్ణులైనచో, మూడవ తరగతికి పంపబడుతారు. ఈ విధముగా భగవంతుడు, తన భక్తుడికి తరువాతి దశలను అనుగ్రహిస్తాడు.

మూడవ దశ చేరి, తగు దిశ తెలియక సంచరించు వాడు, ప్రాణాయామం మొదలగు యోగములను చేసి ప్రయత్నించును. పంచ భూతములలో ఒకటైన వాయువును గూర్చి అనేక యోగ సాధనములు చేయును. తీవ్ర వైరాగ్యము కల వారికి కొన్ని సిద్ధులూ ప్రాప్తించును.

మానవుడు  భక్తునిగా, కర్మ సాధకునిగా, తరువాత యోగిగా అగును.

4. జ్ఞానం:

చివరిగా, నాలుగవ దశ అయిన జ్ఞానం అంతిమ దశ. తాను ఎవరు అని సాధకుడు గ్రహించునది. ఇదే మనము పొందవలసినది అని పరిపూర్ణముగా గ్రహించవలెను.

ఆ పరమాత్మ వద్దకు మనలను తోడ్కొని పోవు మార్గము ఈ జ్ఞాన మార్గము.

భక్తునిగా, కర్మ సాధకునిగా, యోగిగా, పరిపక్వం చెందినవాడు, అంతిమముగా, ఆ పరమాత్మను తన లోనే దర్శించి, అనుభూతి చెంది, స్పష్టత పొంది తనను తాను తెలుసుకొని, సన్మార్గమున పయనించి ఆ పరమాత్మలో లీనమగుట మరణమును జయించుట - దేహము నశింపకుండుట - జనన మరణములను చక్రము నుండి విముక్తి పొంది నిత్య చిరంజీవులుగా జీవించవలెను. మరణమును జయించి అమరత్వమును పొందుటయే మానవుని లక్ష్యము.

చర్య          -      దేహ శుద్ధి , ఆలయ దర్శనము
                        భక్తుడు, దాశ మార్గము

క్రియ         -      అష్టాంగ పూజా విధానములను తానే స్వయముగా చేయుట
                        కర్మ సాధకుడు, సత్త్పుత్ర మార్గము

యోగము  -      ప్రాణ వాయువుని బంధించి సాధన చేయుట
                        యోగి, సహ మార్గము

జ్ఞానము    -      తాను ఎవరినో గ్రహించి, పరమాత్మ సాక్షాత్కారం పొంది, చిరంజీవులుగా నిత్యం జీవించడం
                        జ్ఞాని, సన్మార్గము 



అందరూ, మళ్ళీ జన్మించని వరము ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థించుదురు. ఇప్పటి వరకూ వచ్చిన మహానుభావులు అందరూ మరు జన్మ అనునది లేకుండా వరము ప్రసాదించమని కోరుకున్నారు. కానీ, వడలూరు శ్రీ జ్యోతి రామలింగ స్వామి, ఆ పరమాత్మ యందు మరణము లేని నిత్య జీవితమును ప్రసాదించమని కోరెను. మనము ఇది వరకే పుట్టి ఉన్నాము. ఈ జీవితము సమాప్తి చెందిన తరువాతనే కదా మరు జన్మ, మళ్ళీ పుట్టుట సంభవించును. ఈ జీవితమునే నిత్య జీవితముగా, మరణము లేని జీవితముగా చేసిన యెడల, మళ్ళీ పుట్టుట, మరు జన్మ గురించి ఆలోచించుట అనునది అవసరము లేదు. అందువలనే అందరికన్నా ఒక స్థాయి పైకెళ్ళి ఆ పరమాత్మ వద్ద మరణము లేని జీవితం, అమరత్వమును ప్రసాదించమని ప్రార్థించెను. తన ఒక్కడికి కాక, ఈ మానవ జాతి అంతయూ  దీనిని పొందవలెనని భగవంతుడిని ప్రార్థించెను. ఆ మహా పురుషుని కరుణా హృదయమునకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలెను.

చర్య, క్రియ, యోగం, జ్ఞానం అను ఈ దశలు, ఒక్కొక్కటి నాలుగు భాగములుగా విభజింపబడి, 16 దశలుగా శాస్త్రములు చెప్పుచున్నవి.

1.   చర్యలో చర్య
2.   చర్యలో క్రియ                       - చర్యలో ముక్తి సాలోక పదవి
3.   చర్యలో యోగం
4.   చర్యలో జ్ఞానం

5.   క్రియలో చర్య
6.   క్రియలో క్రియ                       - క్రియలో ముక్తి సామీప పదవి
7.   క్రియలో యోగం
8.   క్రియలో జ్ఞానం

9.   యోగములో చర్య
10. యోగములో క్రియ                 - యోగములో ముక్తి సారూప పదవి
11. యోగములో యోగం
12. యోగములో జ్ఞానం

13. జ్ఞానములో చర్య
14. జ్ఞానములో క్రియ                   - జ్ఞానములో ముక్తి సాయుచ్య పదవి
15, జ్ఞానములో యోగం
16. జ్ఞానములో జ్ఞానం

" ముక్తి అనునది ముందగు సాధనము
  సిద్ధి అనునది నిత్య అనుభవము "       - శ్రీ జ్యోతి రామలింగ స్వామి

 శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు, ఆయనకు జీవులపై గల కరుణచే, 13 వ దశగా ఉన్న జ్ఞానములో సరియ నుండి మనకు బొధించిరి. అనగా ఏ స్థాయి లో ఉన్నవారైననూ ఈ 13 వ దశ నుండి వారి జ్ఞాన సాధనమును కొనసాగించవచ్చు. జ్ఞానము పొందుటకు అభిరుచి, ఆశక్తి ఉన్న వారు ఎవరైనా ఈ 13 వ దశలోనికి ప్రవేశించుటకు అర్హులే అని స్వామి వారు మన అందరినీ ఆహ్వానించుచున్నారు.




No comments:

Post a Comment