వేదములు, సకల శాస్త్రములు మనకు బోధించునది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ ప్రేమ మూర్తి, జ్యోతి స్వరూపుడు. జీవాత్మ పరమాత్మలోని ఒక భాగమే. జీవాత్మ కూడా అంతే స్వచ్చతతో ప్రకాశించుచున్నది. కానీ మనము చేసిన పాప పుణ్య కర్మానుసారం జీవాత్మ మాయ, కర్మ, అహంకారం అను త్రిదోషములతో కప్పబడి అందకారములో ప్రకాశరహితముగా ఉన్నది. దైవ అనుగ్రహముతో జీవాత్మ త్రిదోషముల నుంచి విముక్తి పొందిన, ఆత్మ సాక్షాత్కారం, ఆపై పరమాత్మ దర్శనం సిద్ధించును.
No comments:
Post a Comment