Saturday, February 7, 2015

దైవమును ఎలా చూడగలము?


భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడని మన వేదములు చెప్పుచున్నవి. అణువణువునా విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మ ప్రతి జీవి లోనూ ఉన్నాడని గ్రహించి అన్ని జీవులయందు ప్రేమ, జీవకారుణ్యములతో  ఉన్న, ఆ దేవుడు అతి శులభముగా మనము గ్రహించునట్టుగా మనకు చేరువు కాగలడు.

" మానవ సేవే మాధవ సేవ " అని అన్నారు.

మానవ సేవే కాదు ప్రతి జీవిని అదే ప్రేమతో సేవించినచో భగవంతుని కృపకు తప్పక పాత్రులము కాగలము. అందువలనే హిందూ ధర్మము నందు ప్రతి జీవికి ఒక ప్రాధాన్యం ఇచ్చి దేవతలుగా, దైవ వాహనములుగా వాటిని భక్తీ తో ఆరాధించుచున్నాము.

ప్రేమ, కరుణ, దయ. ఈ మూడు సూత్రాలే దైవానుగ్రహమునకు ముఖ్య సాధనములు. అన్ని జీవులయందు మనము చూపించు ప్రేమయే జీవకారుణ్యము. పరమాత్ముడు మనపై చూపించు ప్రేమయే అనుగ్రహం/దైవక్రుప.

దేవునిని చూడవలెననిన ఆ పరమాత్ముని కృప కావలెను. ఆయన కృప లేనిదే అణువైనా కదలదు. ఆయన క్రుపను పొందుటకు, జీవకారుణ్యమే ఏకైక సాధన.

" జీవకారుణ్యమే మోక్షానికి మార్గము "

" అన్ని ఆత్మలయందు ఆ పరమాత్ముని చూడవలెను "

"ప్రతి జీవాత్మ పరమాత్మ స్వరూపమే అని గ్రహించవలెను "


No comments:

Post a Comment